ICC Rankings: టాప్లోకి రషీద్ ఖాన్ .. మెరుగైన రోహిత్, హార్దిక్ ర్యాంకులు
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఓడినప్పటికీ ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో మెరుగుదల కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తమ విభాగాల్లో ముందడుగు వేశారు. అలాగే పాక్పై టీ20 సిరీస్ను అఫ్గాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్ అగ్రస్థానానికి చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ముందడుగు వేశారు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ (707 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. ఇక టాప్ -10లో భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ కాకుండా శుభ్మన్ గిల్ (5వ స్థానం, 738 పాయింట్లు), విరాట్ కోహ్లీ (7వ స్థానం, 719 పాయింట్లు) మాత్రమే ఉన్నారు. అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (887 పాయింట్లు) కొనసాగుతున్నాడు. భారత్తో మూడు వన్డేల సిరీస్లో ఆడని ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (705 పాయింట్లు) బౌలర్ల జాబితాలో తొలి ర్యాంక్లోనే కొనసాగడం విశేషం. ఈ లిస్ట్లో భారత్ నుంచి కేవలం మహమ్మద్ సిరాజ్ (691) మాత్రమే ఉన్నాడు. మూడో స్థానంలో నిలిచాడు. హార్దిక్ పాండ్య ఏకంగా పది స్థానాలను మెరుగుపర్చుకుని 76వ స్థానానికి చేరుకున్నాడు.
టీ20ల్లో అగ్రస్థానం..
పాకిస్థాన్పై టీ20 సిరీస్ను గెలిచిన అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకుల్లోనూ అదరగొట్టారు. టాప్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ (710) టీ20 ఫార్మాట్లోని బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. 2018లో తొలిసారి ఐసీసీ టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్న రషీద్.. గతేడాది నవంబర్లోనూ అగ్రస్థానానికి చేరాడు. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ తొలి ర్యాంక్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు తొలి ర్యాంక్లో ఉన్న శ్రీలంక స్పిన్నర్ వహిందు హసరంగ (695) రెండో స్థానానికి పడిపోయాడు. టాప్ -10లో భారత్ నుంచి ఒక్క బౌలరూ లేకపోవడం గమనార్హం. యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ 14వ ర్యాంక్లో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్