T20 World Cup: రోహిత్ వన్డౌన్ - సచిన్ సంఘటనతో పోలిక: వీరేంద్ర సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మకు బదులు ఇషాన్ కిషన్ను ఓపెనింగ్కు తీసుకురావడంపై ...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మకు బదులు ఇషాన్ కిషన్ను ఓపెనింగ్కు తీసుకురావడంపై మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే టీమ్ఇండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంతోనే కివీస్ మీద భారత్ ఓడిపోయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ఇండియా బ్యాటింగ్ కూర్పుపై స్పందించాడు. కివీస్తో మ్యాచ్లో తీసుకున్న ఓపెనర్ మార్పు.. 2007 వన్డే ప్రపంచకప్లో సచిన్ తెందూల్కర్ను నాలుగోస్థానంలో పంపించాలనే నిర్ణయంలాంటిదేనని వ్యాఖ్యానించాడు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత్ జట్టు అప్పుడు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది.
తొలుత సచిన్-గంగూలీ జోడీ ఓపెనింగ్ చేసేది. ఎప్పుడైతే సెహ్వాగ్ వచ్చాడో అప్పటి నుంచి సచిన్తో కలిసి ఓపెనింగ్ చేసేవాడు. ఈ రెండు జోడీలు హిట్టే. ప్రత్యర్థిపై ఆరంభ ఓవర్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. 2007 వన్డే ప్రపంచకప్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘లక్ష్య ఛేదనలో సూపర్గా ఆడుతున్నాం. వరుసగా 17 మ్యాచుల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించాం. అలాంటిది 2007 వన్డే వరల్డ్కప్లో రెండు పొరపాట్లు చేశాం. మా కోచ్ (గ్రెగ్ ఛాపెల్) అందరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పాడు. అయితే రెండు మ్యాచ్లు గెలిచాక సూపర్-8కి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన ఆరు మ్యాచుల్లో మార్పులు చేద్దామని చెప్పా. అయితే కోచ్ అలా కుదరదు అని చెప్పాడు. అప్పటికే సచిన్ మిడిలార్డర్లోకి వెళ్లాల్సిన అవసరం లేనేలేదు. ద్రవిడ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. జట్టు బాగా ఆడనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోవాలి. అప్పుడు బాగా ఎందుకు ఆడరు? అంతేకాని జట్టులో మార్పులు చేయడం సరైంది కాదు’’ అని వివరించాడు. బెర్ముడా, శ్రీలంక, బంగ్లాదేశ్తో కూడిన గ్రూప్లో భారత్ ఉంది. అయితే బెర్ముడా మీద భారీ విజయం (257 పరుగుల తేడా) సాధించిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్, లంక చేతిలో ఓటమిపాలై గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరిగింది. టాప్ ఆటగాళ్లు ఉన్న భారత్ ఇలా కావడానికి ప్రధాన కారణం అప్పటి హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోచ్తోపాటు రాహుల్ ద్రవిడ్ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. 2007 టీ20 ప్రపంచకప్కు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జట్టును పంపింది. తొలి టీ20 ప్రపంచకప్ను సగర్వంగా ఎత్తుకున్న ధోనీ.. ఆ తర్వాత నాయకుడిగా ఉన్నత శిఖరాలకు ఎదిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు