Rohit Sharma : అందుకే శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టాం : రోహిత్ శర్మ
వెస్టిండీస్తో బుధవారం (ఫిబ్రవరి 16న) జరిగిన తొలి టీ20 మ్యాచులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డే..
ఇంటర్నెట్ డెస్క్ : వెస్టిండీస్తో బుధవారం (ఫిబ్రవరి 16న) జరిగిన తొలి టీ20 మ్యాచులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డే మ్యాచులో శ్రేయస్ (80) కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయినా, తొలి టీ20 మ్యాచులో దక్కలేదు. ఈ విషయంపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్సందించాడు. అతడిని పక్కన పెట్టడానికి గల కారణాలను వివరించాడు.
‘శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టడం కాస్త కష్టమే. కానీ, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగల ఆటగాడు జట్టుకు చాలా అవసరం. అందుకే, అతడిని పక్కన పెట్టక తప్పలేదు. శ్రేయస్ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రపంచ కప్ జట్టులో అతడికి కచ్చితంగా చోటు ఉంటుంది. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లకు బాగా తెలుసు. ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్నప్పుడూ.. ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తుది జట్టు కూర్పు విషయంలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణించే ఆటగాళ్ల విషయంలో మాకు స్పష్టత ఉంది. యువ ఆటగాళ్లు కూడా జట్టు విజయాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారనుకుంటున్నాను. ఇషాన్ కిషన్ చాలా కాలంగా ఓపెనర్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లోనూ ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున అతడు ఓపెనర్గానే బరిలోకి దిగుతున్నాడు’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తొలి టీ20 మ్యాచులో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!