Rohit Sharma: కోహ్లీ ఫామ్పై ఎందుకింత చర్చ? : రోహిత్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాజాగా రెండో వన్డేలోనూ విఫలమవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతడిని జట్టులో నుంచి తొలగించాలనే డిమాండ్లు బాగా పెరుగుతున్నాయి...
లండన్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాజాగా రెండో వన్డేలోనూ విఫలమవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతడిని జట్టులో నుంచి తొలగించాలనే డిమాండ్లు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ ఫామ్పై ఎందుకింత చర్చ నడుస్తుందో తనకు అర్థంకావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నాడని, అతడెన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడని గుర్తుచేశాడు. అంత గొప్ప బ్యాట్స్మన్కు ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ విషయం గురించి తాను గత ప్రెస్మీట్లోనూ చెప్పానని వెల్లడించాడు.
‘కోహ్లీ లాంటి ఆటగాడు తిరిగి గాడిలో పడాలంటే ఒకటి లేదా రెండు భారీ ఇన్నింగ్స్లు చాలు. అతడి గురించి నేను ఇదే అనుకుంటున్నా. క్రికెట్ని అనుసరించే వాళ్లు కూడా ఇలాగే భావిస్తారని ఆశిస్తున్నా. కోహ్లీ ఫామ్పై మేం కూడా మాట్లాడుకుంటాం. అయితే, పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మేం మాట్లాడాలి. ప్రతి ఒక్కరి కెరీర్లో ఇలాంటి ఒడుదొడుకులు ఉంటాయి. అంతమాత్రాన ఆయా క్రికెటర్ల స్థాయి పడిపోదు. కోహ్లీ ఎన్నో పరుగులు చేసి అనేక సెంచరీలు చేశాడు. అతడి సగటు కూడా మెరుగ్గా ఉంది. మనమంతా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆటగాళ్ల కెరీర్లో ఇవన్నీ సహజమే. ఏ ఒక్కరూ ఆడిన అన్ని మ్యాచ్ల్లో రాణించలేరు. వ్యక్తిగత జీవితాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి’ అని హిట్మ్యాన్ మరోసారి కోహ్లీకి అండగా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని