IPL - 2022 : హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నా.. కలిసొచ్చేదేం లేదు : రోహిత్ శర్మ
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022కు సంబంధించిన మ్యాచులు హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నా.. తమకు అదనంగా కలిసొచ్చేదేమీ లేదని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని..
ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022కు సంబంధించిన మ్యాచులు హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నా.. తమకు అదనంగా కలిసొచ్చేదేమీ లేదని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని.. వారిలో చాలా మందికి ఇంతకు ముందు ముంబయిలో ఆడిన అనుభవం లేదని పేర్కొన్నాడు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కోచ్ మహేల జయవర్ధనెతో కలిసి రోహిత్ మాట్లాడాడు. ఆ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
‘మా జట్టులో చాలా మార్పులు వచ్చాయి. వేలం ద్వారా చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. నాతో పాటు సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఇంతకు ముందు ఇక్కడ మ్యాచులు ఆడాం. మిగతా ఆటగాళ్లలో ఎవరికీ ఇక్కడ ఆడిన అనుభవం లేదు. మరోవైపు, గత రెండేళ్లుగా మేం ముంబయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అందుకే ప్రస్తుత సీజన్లో సొంత మైదానాల్లో మ్యాచులు జరిగినా.. మాకు కలిసొచ్చేదేం లేదు’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
‘ప్రస్తుతం, సూర్యకుమార్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకుంటున్నాడు. ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే అతడు అందుబాటులోకి వస్తాడు. అయితే, తొలి మ్యాచ్లో ఆడతాడా.? లేదా.? అనే విషయంలో స్పష్టత లేదు’ అని రోహత్ పేర్కొన్నాడు. మరోవైపు, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ని ఓపెనర్గా బరిలోకి దింపుతామని రోహిత్ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్-2022 సీజన్కు సంబంధించిన మ్యాచులన్నీ వాంఖడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్, పుణె మైదానాల్లో జరుగనున్నాయి. మార్చి 27న దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబయి తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.