IND Vs SA : ఫీల్డింగ్లో మాది దారుణమైన ప్రదర్శన : రోహిత్
ఫీల్డ్లో తమ ప్రదర్శన సరైన విధంగా లేదని రోహిత్ శర్మ అన్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ‘భారత్పై దక్షిణాఫ్రికా గెలిచింది.. కాదు కాదు.. టీమ్ఇండియానే విజయాన్ని సఫారీలకు పువ్వుల్లో పెట్టి అందించింది..’ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్నటి మ్యాచ్లో రోహిత్ సేన ప్రదర్శన చూసిన అభిమానులు ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుని.. ఫీల్డింగ్ తప్పిదాలతో తడబడ్డ భారత్.. 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. ఈ తప్పిదాలను అంగీకరించాడు. ఫీల్డింగ్లో తమ జట్టు దారుణమైన ప్రదర్శన చేసిందని అన్నాడు.
‘ఫీల్డ్లో మా ప్రదర్శన సరైన విధంగా లేదు. గతంలో మేం ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడాం. కాబట్టి పరిస్థితులను మా ఓటమికి కారణంగా చెప్పి తప్పించుకోలేం. మా ప్రదర్శన నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. నాతో పాటు మేం కొన్ని రనౌట్లను మిస్ చేశాం’ అని రోహిత్ విచారం వ్యక్తం చేశాడు.
ఇక అశ్విన్తో 18వ ఓవర్ వేయించడంపై కూడా కెప్టెన్ స్పందించాడు. ‘స్పిన్నర్లతో చివరి ఓవర్లను వేయిస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే చివరి ఓవర్కు ముందే అశ్విన్తో బౌలింగ్ చేయించాలనుకున్నా. సీమర్లతో సరైన ఓవర్లు వేయించాలనుకున్నాను. కొత్త బ్యాటర్ రావడంతో.. అశ్విన్ బౌలింగ్ చేయడానికి ఇదే సరైన సమయమని భావించాను’ అని వివరించాడు.
నిన్నటి మ్యాచ్లో పేలవ ఫీల్డింగ్తో మ్యాచ్ను రోహిత్ సేన చేజార్చుకున్న విషయం తెలిసిందే. జోరుమీదున్న మార్క్రమ్.. 12వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్ను డీప్ మిడ్వికెట్లో కోహ్లి విడిచిపెట్టాడు. ఇక 13వ ఓవర్లో మార్క్రమ్ను రనౌట్ చేసే చక్కని అవకాశాన్ని రోహిత్ వృథా చేశాడు. అతి సమీపం నుంచి కూడా అతడు స్టంప్స్ను కొట్టలేకపోయాడు. సూర్యకుమార్ సరిగ్గా త్రో చేసి ఉంటే 9వ ఓవర్లో కూడా మార్క్రమ్ ఔటయ్యేవాడు. ఇక టీ20 ప్రపంచకప్లో భారత్ నిన్న తొలి పరాజయాన్ని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం