Mohammed siraj: సిరాజ్, శ్రేయస్, రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డులు!
బంగ్లాదేశ్తో రెండో వన్డే సందర్భంగా భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit sharma), మహమ్మద్ సిరాజ్(Mohammed siraj), శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డులు సాధించారు.
దిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)తో రెండో వన్డేలో టీమ్ఇండియా(Team india) ఓటమిని చవిచూసినప్పటికీ ఈ మ్యాచ్తో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులను అందుకున్నారు . బుధవారం టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed siraj) ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది తన బౌలింగ్తో పవర్ప్లేతో పాటుగా డెత్ ఓవర్లలోనూ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపుగా బంతులేస్తూ రాణించాడు. 14 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ కుర్రాడు.. 2022లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్తో రెండో వన్డేలోనూ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఫార్మాట్లో 14 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ను సిరాజ్ అధిగమించాడు.
మరోవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా జట్టును గెలిపించడానికి ఆఖరి వరకూ పోరాడిన రోహిత్ శర్మ(Rohit sharma) కూడా అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 (ఇప్పటివరకు మొత్తం సిక్సులు 502) సిక్సులు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్గేల్ 553 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
శ్రేయస్ ఖాతాలోనూ..
నిలకడైన ఆటతీరుతో జట్టుకు సానుకూలంగా మారిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. తాజాగా వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1,500 పరుగుల మైలురాయిని దాటిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు. మొత్తం వన్డే కెరీర్లో ఈ ఆటగాడు 38 మ్యాచుల్లో 34 ఇన్నింగ్స్లు ఆడాడు. యావరేజీ 49.48తో ఇప్పటివరకు 1,534 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి. గతంలో 36 ఇన్నింగ్స్ల్లో కేఎల్ రాహుల్ 1500 మార్క్ను అందుకోగా.. ఇప్పుడు అయ్యర్ దానిని అధిగమించాడు. విరాట్ కోహ్లీ (38), శిఖర్ ధావన్ (38)ని కూడా శ్రేయస్ దాటేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.