IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్
ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023). అందులోనూ ఎంఎస్ ధోనీ ఆట అంటే.. ఆటగాళ్లతోపాటు అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే ప్రతి సీజన్కు ముందు అభిమానుల్లో మెదిలే అనుమానం ఒకటుంటుంది. దానిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూటిగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ (IPL 2023) కొత్త సీజన్ ప్రారంభం కానుంది. గత రెండు సీజన్ల నుంచి టోర్నీ మొదలు కావడానికి ముందు ప్రతిసారి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకిదేనా చివరి సీజన్..? 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీ కేవలం ఐపీఎల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచుల్లో కెప్టెన్సీ వదిలేయడంతో అదే చివరిదని అంతా భావించారు. తీరా రెండో సగంలో రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలను ధోనీ మళ్లీ అందుకొన్నాడు. ఈసారి సీజన్ కోసం ప్రాక్టీస్ను కూడా ధోనీ షురూ చేసేశాడు. అయినాసరే మళ్లీ అదే అనుమానం.. ఇదేనా చివరి సీజన్..? దీనికి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చేశాడు.
‘‘నేను గత మూడేళ్లుగా ఇవే మాటలు వింటూ ఉన్నా. ధోనీకి ఇదేనా చివరి సీజన్ అని తరచూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ధోనీ ఫిట్నెస్ను చూస్తే కనీసం మరో మూడు సీజన్లు ఆడతాడని భావిస్తున్నా’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయికి పడిపోయింది. బుమ్రా లేకుండానే ఈసారి బరిలోకి దిగనుంది.
రుతురాజ్ కీలకం: ఆకాశ్ చోప్రా
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కీలకమవుతాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు. ఈ సీజన్లోనూ సీఎస్కేకు గైక్వాడ్ కీలకమవుతాడు. అయితే, రుతురాజ్ ఇప్పటి వరకు ఆడుతున్న విధంగా కాకుండా జోరు పెంచాలి. ఆరంభంలో నిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించి తర్వాత దూకుడు పెంచుతాడు. అయితే డీజిల్ ఇంజిన్స్ కాలం మారిపోతోంది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా. అందుకు తగ్గట్టుగా రుతురాజ్ మారిపోవాలి. ఇక బెన్ స్టోక్స్ను తీసుకోవడం సరైన నిర్ణయంగా అనిపించదు. మిడిలార్డర్లో అతడు ఎలా రాణిస్తాడనేది చూడాలి’’ అని చోప్రా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు