Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
మూడో వన్డేలో ఓడినా మెగా టోర్నీలో మా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం ఉండదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్లో భారత్ (IND vs AUS) పరాజయం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ ఇబ్బందేం లేదని.. కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఆసీస్ చేతిలో టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయినా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. టైటిల్ను అందుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘వ్యక్తిగతంగా నా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉంది. అన్ని విధాలుగా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ఆడాలనేదే నా లక్ష్యం. గత ఏడెనిమిది వన్డేల్లో మా ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం. విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. వేర్వేరు జట్లతో బరిలోకి దిగాం. కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ముందుడుగు వేశాం. దురదృష్టవశాత్తూ మూడో వన్డేలో ఓడిపోయాం. అయినా ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై మెరుగైన బౌలింగ్ ప్రదర్శనే చేశాం.
పేసర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగొచ్చిన తర్వాత అతడి ఆటతీరు అద్భుతం. అతడు బౌలింగ్లో లయను అందుకోవడంతో భారత్కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బ్యాటింగ్ పిచ్ అయినా సరే బుమ్రా బౌలింగ్ ఆకట్టుకుంది. ఆరంభంలో కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చినా తర్వాత నియంత్రించాడు. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి. ఒక మ్యాచ్లో పరుగులు ఇచ్చినంత మాత్రాన సమస్యేమీ కాబోదు. ఇక వరల్డ్ కప్ గురించి అంతా అడుగుతుంటారు. జట్టులోకి ఎవరు వస్తారు? ఏవైనా మార్పులు ఉంటాయా? అని అందరిలోనూ సందేహాలు రావడం సహజం. అయితే, వరల్డ్ కప్ కోసం 15 మందిపై మాకు పూర్తి స్పష్టత ఉంది. ఇందులో ఎలాంటి అయోమయం లేదు. తప్పకుండా అద్భుతమైన జట్టుతోనే బరిలోకి దిగుతాం. ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే మనం ఛాంపియన్గా నిలవగలం’’ అని రోహిత్ అన్నాడు.
మరికొన్ని విశేషాలు..
- రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆరు సిక్స్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ సిక్స్ల సంఖ్య 551కి చేరింది. మరో మూడు కొడితే క్రిస్ గేల్ను అధిగమిస్తాడు. ప్రస్తుతం గేల్ 553 సిక్స్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
- రాజ్కోట్ వేదికగా ప్రతి నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్ను తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇప్పుడు ఆసీస్ కూడా మొదట బ్యాటింగ్లో 350+ స్కోరు చేసింది.
- భారత్లో ఒక మ్యాచ్లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు నమోదైన ఐదో మ్యాచ్ ఇదే. ఆసీస్-భారత్ కలిసి 638 పరుగులు సాధించాయి. అయితే ఇరు జట్లలో ఒక్కరూ శతకం చేయలేదు. మిచెల్ మార్ష్ (96) టాప్ స్కోరర్.
- వన్డేల్లో ఆసీస్ స్పిన్నర్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో గ్లెన్ మాక్స్వెల్ నాలుగో ఆటగాడు. షేన్ వార్న్ అందరికంటే ఎక్కువగా 13సార్లు ఈ ఫీట్ను సాధించాడు. మాక్స్వెల్కు (4/40) ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
- జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో అత్యధికంగా పరుగులు సమర్పించడం ఇది రెండోసారి. అతడు ఆసీస్పై తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 81 పరుగులు సమర్పించాడు. గతంలో (2017లో) ఇంగ్లాండ్పై 2/81 ప్రదర్శన చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
T20I Record: టీ20ల్లో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు..
టీ20ల్లో టీమ్ఇండియా(Team India) రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరించింది. -
Prasidh Krishna: వన్డేల్లో హిట్టు.. టీ20ల్లో ఫట్టు .. ప్రసిద్ధ్ పంజా విసిరేనా?
టీమ్ఇండియా యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) వన్డేల్లో అదగొట్టేస్తున్నాడు. కానీ, టీ20లకు వచ్చేసరికి ఇబ్బంది పడటం గమనార్హం. ఆసీస్తో పొట్టి సిరీస్లోనూ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. -
Rohit Sharma: రోహిత్ అప్పటిదాకా..
కనీసం 2024 టీ20 ప్రపంచకప్ వరకు రోహిత్ టీ20 కెప్టెన్గా ఉండాలని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్ రోహిత్తోపాటు కోహ్లి. -
Mitchell Marsh: వరల్డ్ కప్పై మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్
ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సమర్థించుకున్నాడు. కప్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. -
Pro Kabaddi League: కూతకు వేళాయె.. నేటి నుంచే ప్రొ కబడ్డీ సీజన్-10
పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు... చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు.. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్ కోసం! -
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
ఐపీఎల్ వేలం ప్రక్రియ మొదలైంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్ పిలుపునివ్వగా.. 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. -
టీచర్ అవుదామనుకొని..
రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్ శీతల్దేవి చెప్పింది. నంబర్వన్ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. -
IND vs AUS: కంగారూలను తిప్పేశారు
టీమ్ఇండియా అదరహో. నాలుగో టీ20లో కంగారూలను మట్టికరిపించిన ఆతిథ్య జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పొట్టి సిరీస్ను పట్టేసింది. గత మ్యాచ్లో కొండంత స్కోరు చేసినా పరాజయంపాలైన భారత్.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకు మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. -
Salman Butt: పాక్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం.. సెలెక్షన్ కమిటీలో బట్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ నేరంపై శిక్ష అనుభవించిన మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ పీసీబీ సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. -
గెలుపు బాటలో బంగ్లా
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/40) ఉచ్చులో చిక్కుకున్న కివీస్ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. -
బ్రిస్బేన్ ఓపెన్తో రఫా పునరాగమనం
దాదాపు ఏడాది పాటు టెన్నిస్కు దూరంగా ఉన్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ పునరాగమనం చేయబోతున్నాడు. జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో అతడు బరిలో దిగనున్నాడు. 37 ఏళ్ల రఫా.. -
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుంది: ధుమాల్
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ 50 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4.14 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. -
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. భారత్ 3-1 తేడాతో (IND vs AUS) కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో విజయం సాధించడంపై సూర్యకుమార్ స్పందించాడు. -
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ (Axar Patel) .. ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో నాలుగో టీ20 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కాయని పేర్కొన్నాడు. -
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
దక్షిణాఫ్రికాతో (IND vs SA) వన్డే, టెస్టు, టీ20 సిరీస్లకు జట్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.


తాజా వార్తలు (Latest News)
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం
-
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్