Rohit Sharma : డెత్ ఓవర్లపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?
నిర్ణయాత్మక పోరులో అద్భుత ప్రదర్శన చేసి రోహిత్ సేన సిరీస్ను కైవసం చేసుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్ ముందు
ఇంటర్నెట్ డెస్క్ : నిర్ణయాత్మక పోరులో అద్భుత ప్రదర్శన చేసి రోహిత్ సేన సిరీస్ను కైవసం చేసుకోవడంతోపాటు టీ20 ప్రపంచకప్ ముందు తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. నిన్న హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అన్ని విభాగాల్లో రాణించినప్పటికీ.. టీమ్ఇండియాను ఇప్పటికీ డెత్ ఓవర్ల బౌలింగ్ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆసియా కప్లోనూ ఇదే దెబ్బకొట్టగా.. ఆసీస్తో తొలి మ్యాచ్లోనూ ఓటమికి ఇదో కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు.
ఆదివారం నాటి మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా..? అన్న ప్రశ్నకు స్పందించాడు. ‘చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా మా డెత్ ఓవర్ల బౌలింగ్. వచ్చే నెలలోనే టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది’ అని అన్నాడు. అయితే.. ఈ విషయంలో బౌలర్లు త్వరలోనే గాడినపడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘వారిద్దరూ(హర్షల్ పటేల్, బుమ్రా) చాలా కాలం తర్వాత జట్టుకు ఆడుతున్నారు. ఆసీస్ మిడిల్, లోయర్ ఆర్డర్కు బౌలింగ్ చేయడం కష్టమే అని తెలిసినందున నేను నిజంగా దానిని పట్టించుకోను. వారు విరామం తర్వాత వచ్చినందున.. కాస్త సమయం తీసుకుంటారు. వారు తిరిగి గాడిలో పడతారని ఆశిస్తున్నా’ అని రోహిత్ వివరించాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించినందుకు మొత్తంగా జట్టు ప్రదర్శనపై సారథి సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేయగా.. ఛేదనలో రోహిత్ సేన 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు