IND vs AUS: అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది: రోహిత్ శర్మ
బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోయారు. ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా (IND vs AUS) ఘోర ఓటమిని చవిచూసింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో (IND vs AUS) భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో (ODI Series) 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్లో తడబాటుకు గురైన టీమ్ఇండియా (Team India).. బౌలింగ్లోనూ ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ మాట్లాడారు.
117 పరుగులు.. చాలా తక్కువ: రోహిత్ (Rohit Sharma)
‘‘మ్యాచ్ ఓడిపోతే చాలా నిరుత్సాహం ఉంటుంది. తొలుత బ్యాటింగ్లో మేం సరిగా ఆడలేదు. స్కోరుబోర్డుపై సరిపోయేనన్ని పరుగులు పెట్టలేకపోయాం. ఈ పిచ్ మీద 117 పరుగులు చేయడం సరైంది కాదు. వరుసగా వికెట్లను కోల్పోవడం వల్ల మేం అనుకున్న విధంగా స్కోరు చేయలేకపోయాం. తొలి ఓవర్లోనే గిల్ ఔట్ కావడం.. ఆ తర్వాత నేను, విరాట్ కాసిన్ని పరుగులు రాబట్టినా సరిపోలేదు. వెనువెంటనే వికెట్లు పడటం మాకు నష్టం చేసింది. అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది. ఇవాళ మా రోజు కాదు. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడం వల్ల బ్యాటర్లకు ఇబ్బందిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ అద్భుతమైన బ్యాటర్. పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను మా నుంచి దూరం చేశాడు’’ అని రోహిత్ తెలిపాడు.
చాలా త్వరగా ముగుస్తుందనుకోలేదు: స్మిత్ (Steve Smith)
‘‘కేవలం 37 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఇంత త్వరగా ముగిస్తుందని అస్సలు ఊహించలేదు. కొత్త బంతితో స్టార్క్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆరంభం చాలా బాగుంది. వికెట్ ఎలా ఉంటుందో తొలుత అంచనా వేయలేదు. లక్ష్యం ఎంత ఉంటే సరిపోతుందో కూడా ఆలోచించలేదు. మా నైపుణ్యంతో టీమ్ఇండియాపై ఒత్తిడి తేవాలని భావించాం. అదే ప్రణాళికను అమలు చేశాం. ఛేదనలో హెడ్, మార్ష్ అదరగొట్టేశారు. గత మ్యాచ్లోనూ మార్ష్ రాణించాడు. కానీ, ఓడిపోయాం.. ఇప్పుడు ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించాం. ఇక సింగిల్ హ్యాండ్తో క్యాచ్ను పట్టడం బాగుంది. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ అని అనుకోవడం లేదు. హార్దిక్ వంటి పెద్ద వికెట్ను పెవిలియన్కు చేర్చడం సంతోషంగా ఉంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ దండయాత్ర.. రికార్డులే రికార్డులు..
ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్(SRH) అదరగొడుతోంది. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. -
‘మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా’.. ఐపీఎల్ నుంచి మ్యాక్స్వెల్ బ్రేక్
Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ టోర్నీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. తన స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాలని జట్టు యాజమాన్యానికి స్వయంగా చెప్పాడు. -
వరుస ఓటములు జట్టును కుంగదీశాయి: బెంగళూరు కెప్టెన్
Bengaluru X Hyderabad: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు సోమవారం తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్ రికార్డు స్కోరు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం దాని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓటమికి గల కారణాలను వివరించాడు. -
నేనూ బ్యాటర్ అయితే బాగుండే: కమిన్స్
Bengaluru X Hyderabad: సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. -
277 పోయె.. 287 వచ్చె!
2024 మార్చి 27.. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ రోజు ముంబయి బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్. -
ఒత్తిడికి చిత్తవుతున్నాడా?
హార్దిక్ పాండ్య.. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకడు. ముంబయి ఇండియన్స్ ఒకప్పుడు టైటిళ్ల మీద టైటిళ్లు గెలవడంలో అతడి పాత్ర కీలకం. ఇక రెండేళ్ల ముందు కెప్టెన్గా కూడా ఐపీఎల్పై తనదైన ముద్ర వేశాడీ బరోడా ఆటగాడు. -
నది నుంచి స్టేడియంలోకి!
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సన్నద్ధమవుతోంది. ఫ్రాన్స్ నగరంలో ప్రవహించే సెన్ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది. -
అలెక్నా ప్రపంచరికార్డు
డిస్కస్ త్రోలో లిత్వేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్హోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్నా స్వర్ణం గెలుచుకున్నాడు. -
మరో సింధుని అవుతా
పి.వి.సింధునే తనకు స్ఫూర్తి అని ఆమెలాగే తానూ ఛాంపియన్ ప్లేయర్గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ షట్లర్ తన్విశర్మ చెప్పింది. 15 ఏళ్ల తన్వి.. ఈ నెల చైనాలో జరిగే ఉబర్కప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు. -
నకమురపై విదిత్ విజయం
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి సత్తా చాటాడు. తొమ్మిదో రౌండ్లో అతడు రెండో సీడ్ హికరు నకముర (అమెరికా)పై విజయం సాధించాడు. -
పోలీసుల రిమాండ్లో ఆసీస్ మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మైకెల్ స్లేటర్ను పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సంక్షిప్త వార్తలు (5)
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో నిర్వహించే రెండు ఐపీఎల్ మ్యాచ్లు హైబ్రిడ్ పిచ్పై జరగనున్నాయి. మే 5న పంజాబ్-చెన్నై, మే 9న పంజాబ్-బెంగళూరు మ్యాచ్ల్లో ఈ ప్రయోగం చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిషేక్ Vs అభిజీత్.. దీదీ మేనల్లుడికి భాజపా గట్టి పోటీ
-
భారాస మాదిరిగానే కాంగ్రెస్ది మాటల గారడీ: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
-
సన్రైజర్స్ దండయాత్ర.. రికార్డులే రికార్డులు..
-
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన భాజపా
-
ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు: ఎంపీ ధర్మపురి అర్వింద్