Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గురువారం నుంచి ప్రారంభం కానుంది. గత మూడు పర్యాయాల సెంటిమెంట్ను ఈసారి కూడా టీమ్ఇండియా కొనసాగిస్తుందా..? లేదా..? అనేది అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘గత మూడు పర్యాయాలు ఆతిథ్య దేశమే వరల్డ్ కప్ను (ODI World Cup 2023) నెగ్గిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమవుతుందా..?’ ఇదీ టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అడిగిన ప్రశ్న. పది జట్ల సారథులతో ఐసీసీ నేతృత్వంలో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దానికి వ్యాఖ్యాతగా రవిశాస్త్రి వ్యవహరించాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి అడిగిన ఆ ప్రశ్నకు రోహిత్ శర్మ సమయోచిత సమాధానం ఇచ్చాడు. ఇదే కాకుండా గత వరల్డ్ కప్ ఫైనల్ ఫలితంపైనా రోహిత్ స్పందించాడు.
భారత్ వేదికగా జరగడంపై..
స్వదేశంలో మ్యాచ్లు జరగనుండటం ఆనందంగానే ఉంది. అయితే, ఇదేమీ తమకే ప్రయోజనమవుతుందని మాత్రం భావించడం లేదు. గత మూడు వరల్డ్ కప్లను ఆతిథ్య జట్లే గెలిచాయి. అయితే, ఈసారి కూడా గెలుస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజమే. కానీ మేము మాత్రం మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిసారించాం. ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తాం. అప్పుడే ఉత్తమ ఫలితాలను రాబట్టగలం. భారత్లో మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ ఉంటుంది. గొప్ప టోర్నీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
వార్మప్లు రద్దు కావడం..
ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లతో వార్మప్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే, వరుసగా పర్యటనలు చేసి వేడి వాతావరణం ఎదుర్కొని వచ్చిన మాకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. మెగా టోర్నీకి ముందు చాలా క్రికెట్ ఆడాం. ఆసియా కప్లో నాలుగు మ్యాచ్లు, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను ఆడటం కలిసొస్తుంది. ఇప్పుడు వాతావరణం ఇలా ఉండటంపై మరీ ఆందోళనగా ఏమీ లేదు. భారత్లో వేర్వేరుగా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం.
గత వరల్డ్ కప్ ఫైనల్ ఫలితంపై..
వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఫలితం వెలువరించడం జరిగింది. న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే, ఫలితం నిర్ణయంపై స్పందించడం సరైంది కాదు. అది నేను నిర్వర్తించే బాధ్యత కూడా కాదు. అందుకోసం ప్రత్యేక యంత్రాంగం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
ఐపీఎల్ వేలం ప్రక్రియ మొదలైంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్ పిలుపునివ్వగా.. 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. -
కంగారూలను తిప్పేశారు
టీమ్ఇండియా అదరహో. నాలుగో టీ20లో కంగారూలను మట్టికరిపించిన ఆతిథ్య జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పొట్టి సిరీస్ను పట్టేసింది. గత మ్యాచ్లో కొండంత స్కోరు చేసినా పరాజయంపాలైన భారత్.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకు మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. -
కూతకు వేళాయె
పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు... చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు.. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్ కోసం! -
రోహిత్ అప్పటిదాకా..
కనీసం 2024 టీ20 ప్రపంచకప్ వరకు రోహిత్ టీ20 కెప్టెన్గా ఉండాలని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్ రోహిత్తోపాటు కోహ్లి. -
సెలెక్షన్ కమిటీలో బట్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ నేరంపై శిక్ష అనుభవించిన మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ పీసీబీ సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. -
గెలుపు బాటలో బంగ్లా
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/40) ఉచ్చులో చిక్కుకున్న కివీస్ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. -
టీచర్ అవుదామనుకొని..
రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్ శీతల్దేవి చెప్పింది. నంబర్వన్ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. -
బ్రిస్బేన్ ఓపెన్తో రఫా పునరాగమనం
దాదాపు ఏడాది పాటు టెన్నిస్కు దూరంగా ఉన్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ పునరాగమనం చేయబోతున్నాడు. జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో అతడు బరిలో దిగనున్నాడు. 37 ఏళ్ల రఫా.. -
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుంది: ధుమాల్
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ 50 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4.14 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. -
మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్
ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సమర్థించుకున్నాడు. కప్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. -
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. భారత్ 3-1 తేడాతో (IND vs AUS) కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో విజయం సాధించడంపై సూర్యకుమార్ స్పందించాడు. -
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ (Axar Patel) .. ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో నాలుగో టీ20 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కాయని పేర్కొన్నాడు. -
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
దక్షిణాఫ్రికాతో (IND vs SA) వన్డే, టెస్టు, టీ20 సిరీస్లకు జట్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.


తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య