IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ దూరం

దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కావాల్సిన మూడు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడి చేతికి గాయం

Updated : 13 Dec 2021 19:48 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కావాల్సిన మూడు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడి ఎడమ చేతికి గాయం అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారిక ప్రకటన చేశాడు.  డిసెంబరు 16న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కోసం బయలు దేరాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌తో రోహిత్‌ కెప్టెన్‌గానూ, టెస్టు సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో గుజరాత్‌కి చెందిన యువ ఆటగాడు ప్రియాంక్‌ పాంచల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని