Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముంగిట ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్ రోహిత్శర్మ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ (IPL 2023) వల్ల ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ (World Cup) జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ సైతం ఐపీఎల్ అనంతరం జరుగుతుంది. ఈ రెండు కీలక టోర్నమెంట్ల దృష్ట్యా ఆటగాళ్లు ఫిట్గా ఉండాలంటే ఒత్తిడి ఉండకూడదు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ వల్ల ఆటగాళ్లు పనిభారంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్.. ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్షిప్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గాయాల కారణంగా బుమ్రా, శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఆడలేదు. డిసెంబర్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధించే శ్రేయస్ అయ్యర్ వెన్ను సర్జరీ కారణంగా ఐదు నెలల పాటు అందుబాటులో ఉండడని సమాచారం. ఐపీఎల్ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా గాయాలపాలైతే టీమ్ఇండియా ప్రపంచకప్లో రాణించడం కష్టమవుతుంది. కాబట్టి ఆటగాళ్ల పనిభారంపై దృష్టి పెట్టడం ఐపీఎల్ ఫ్రాంచైజీల బాధ్యతేనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఫిట్గా ఉండేలా టీమ్ఇండియా యాజమాన్యం ఇప్పటికే సూచనలు చేసిందని తెలిపాడు.
‘‘ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదే. ఎందుకంటే వారే ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. మేం అన్ని జట్లకు సూచనలిచ్చాం. ప్రపంచకప్ వరకు ఫిట్గా ఉండాల్సిన బాధ్యత ఆటగాళ్లదే’’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఉంటుంది. కానీ అది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ‘‘విశ్రాంతి తీసుకోవాలని ఆటగాళ్లు భావిస్తే తమ జట్టు యాజమాన్యాలతో, ఫ్రాంచైజీలతో చర్చించి ఒకటి రెండు మ్యాచులకు విరామం తీసుకోవచ్చు. కానీ వారు అనుమతిస్తారా లేదా అనేది అనుమానమే’’ అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ గుజరాత్, చెన్నై జట్ల మధ్య అహ్మదాబాద్లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జూన్ 7 నుంచి ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు