IPL Mega Auction: ఐపీఎల్ వేలంపాట ఫీవర్.. ఆసక్తికర ఫొటోను పంచుకున్న రోహిత్ శర్మ
ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం వేలం జోరుగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ మొత్తంలో అమ్ముడయ్యారు......
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం వేలం జోరుగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ మొత్తంలో అమ్ముడయ్యారు. శనివారంతోపాటు ఆదివారం కూడా ఈ వేలంపాట కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సారథి ఓ ఆసక్తిరక ఫొటోను పంచుకున్నాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్ వేలంపాటను టీవీలో ఆసక్తిగా తిలకిస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘కొందరు ముఖాల్లో టెన్షన్, మరికొందరి మోముల్లో చిరునవ్వు’ అంటూ పేర్కొన్నాడు. రోహిత్ పంచుకున్న ఫొటోలో యజువేంద్ర చహల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్తోపాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి జోరుమీదున్న టీమ్ఇండియా.. టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్లో జరిగే మ్యాచ్ల కోసం జట్టు కోల్కతాకు చేరుకుంది.
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ వేలంపాట చర్చలే. యువ ఆటగాళ్లపై నమ్మకముంచిన ఫ్రాంచైజీలు వారిపై భారీగా వెచ్చిస్తున్నాయి. యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు ఏకంగా రూ. 15.25 కోట్ల ధర పలికింది. పాత జట్టు ముంబయి ఇండియన్స్ కిషన్ను మళ్లీ దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. యువ బౌలర్లపై కనకవర్షం కురిసింది. దీపక్ చాహర్ భారీ ధర పలికాడు. చెన్నై జట్టు అతడిని రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ను రూ. 10.75 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్ సహా ప్రసిద్ధ్ కృష్ణ, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్పైనా ఫ్రాంచైజీలు భారీగానే వెచ్చించాయి. అయితే సురేశ్ రైనాతోపాటు మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు మొండిచేయి మిగిలింది. వారిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.