IND Vs AUS : రోహిత్‌, విరాట్‌ల గెలుపు సంబరాలు.. చూస్తారా..?

సిరీస్‌ ఫలితం తేల్చే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆసీస్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. హైదరాబాద్‌ క్రీడాభిమానులకు

Published : 26 Sep 2022 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సిరీస్‌ ఫలితం తేల్చే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆసీస్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. హైదరాబాద్‌ క్రీడాభిమానులకు అసలైన క్రికెట్‌ మజాను అందించింది. ఈ సిరీస్‌ విజయంతో.. టీ20 ప్రపంచకప్‌ వైపు రోహిత్‌ సేన సగర్వంగా ముందడుగు వేసింది.

దాదాపు మూడేళ్ల అనంతరం ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగడం.. ఈ విజయంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ గెలుపు నేపథ్యంలో డగౌట్‌ ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ కోహ్లీల సంబరాలు ఆకట్టుకున్నాయి. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికే సిక్సర్‌ బాదిన విరాట్‌ (63; 48 బంతుల్లో 3×4, 4×6) సమీకరణాన్ని తేలిక చేశాడు. కానీ తర్వాతి బంతికే ఔటైపోయాడు. ఆ సమయంలో డగౌట్‌ ముందు మెట్లపై నిల్చొని రోహిత్‌.. విరాట్‌ను అభినందించాడు. అనంతరం వీరిద్దరూ మెట్లపైనే కూర్చొని చివరి ఓవర్‌ను వీక్షించారు. టీమ్‌ఇండియా విజయం సాధించగానే ఆనందంతో ఊగిపోతూ ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. రోహిత్‌ను దగ్గరికి తీసుకొని కోహ్లీ అభినందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరి సంబరాల వీడియో వైరల్‌గా మారింది.

ఆసీస్‌ విధించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లే కోల్పోయి ఛేదించిన టీమ్‌ఇండియా.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని