BCCI: ట్రెండింగ్లో బీసీసీఐ పాలిటిక్స్.. మూడేళ్ల నాటి రోహిత్ ట్వీట్ వైరల్
టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను జట్టులో నుంచి అర్ధాంతరంగా తొలగించడం, అలాగే ఓ జర్నలిస్టు అతడిని ఇంటర్వ్యూ ఇవ్వాలని బలవంతం చేయడంపై
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను జట్టులో నుంచి అర్ధాంతరంగా తొలగించడం, అలాగే ఓ జర్నలిస్టు అతడిని ఇంటర్వ్యూ ఇవ్వాలని బలవంతం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు శనివారం బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించగా అందులో సాహాను ఎంపిక చేయలేని సంగతి తెలిసిందే. మరోవైపు అతడితో పాటు ఇటీవల సరిగ్గా ఆడని పుజారా, రహానె, ఇషాంత్ను కూడా తొలగించారు. అయితే, టెస్టు జట్టు ప్రకటించాక సాహా మాట్లాడుతూ తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు. తొలుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తనని రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించాడని, అంతకుముందు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాను పదవిలో ఉన్నంత కాలం జట్టులో చోటు ఉంటుందనే భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ ట్వీట్ చేసిన సాహా.. తనని ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జరల్నిస్టు వాట్సాప్లో బలవంతం చేసిన మెసేజీలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా టీమ్ఇండియా అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబెకింది. బీసీసీఐలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ ట్విటర్లో వరుసగా పోస్టులు పెడుతున్నారు. అతడి విషయంలో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడుతున్నారు. సాహాను తొలగించడానికి కారణం చెప్పబోమని, అది సెలెక్షన్ కమిటీ నిర్ణయం అని చేతన్ పేర్కొనడంతో నెటిజన్లు అతడిపైనా, ఆ జర్నలిస్టుపైనా, టీమ్ఇండియా యాజమాన్యంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో #BCCIPolitics #Wriddhiman Saha, #BCCI అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లోకి వచ్చాయి.
రోహిత్ మూడేళ్ల ట్వీట్ వైరల్..
మరోవైపు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. శనివారం అతడిని బీసీసీఐ నూతన టెస్టు సారథిగా నియమించాక ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. 2018 సెప్టెంబర్ 1న అతడు ట్విటర్లో అభిమానులతో #AskRohit పేరిట ముచ్చటించిన సందర్భంగా.. తన ఫేవరెట్ కొటేషన్ ఏంటని ఓ అభిమాని అడిగారు. దానికి స్పందిస్తూ ‘తనని ఎంత అణచివేస్తే అంత పైకి తిరిగొస్తా’నని హిట్మ్యాన్ బదులిచ్చాడు. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్న అతడు తాజాగా టెస్టు పగ్గాలూ అందుకున్నాడు. దీంతో రోహిత్ను మూడు ఫార్మాట్లకూ సారథిగా ఎంపిక చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పాత ట్వీట్ను కూడా తిరిగి షేర్ చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు టెస్టులకు పనికిరాడు అని పక్కనపెట్టిన ఆటగాడే ఇప్పుడు టీమ్ఇండియా జట్టుకు కెప్టెన్గా ఎదిగాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా