సచిన్‌-దాదా తర్వాత శిఖర్‌-రోహితే

టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు. వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌...

Updated : 29 Mar 2021 04:50 IST

వన్డేల్లో 5000+ పరుగులు చేసిన ఓపెనింగ్‌ జోడీ

పుణె: టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు. వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌ జోడీగా చరిత్ర సృష్టించారు.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనింగ్‌ జోడీ 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శిఖర్‌ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4) అర్ధశతకం సాధించాడు. చక్కని బౌండరీలతో చెలరేగాడు. అతడికి తోడుగా రోహిత్‌ (37; 37 బంతుల్లో 6×4) సైతం దూకుడుగానే ఆడాడు. దీంతో వీరి భాగస్వామ్యం మొత్తంగా 5000 పరుగులు దాటేసింది.

వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులను సాధించిన ఓపెనింగ్‌ జోడీ సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీదే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు చేయడం ప్రత్యేకం. ఆ తర్వాత మరెవ్వరూ వీరిని సమీపించలేదు. సంగక్కర-జయవర్దనె 5992, దిల్షాన్‌-సంగక్కర 5475, జయసూర్య-ఆటపట్టు 5462, గిల్‌క్రిస్ట్‌-హెడేన్‌ 5409, గ్రీనిడ్జ్‌-హెయిన్స్‌ 5206 పరుగులతో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్‌-శిఖర్ జోడీ ప్రవేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని