Rohit Sharma: ‘దాన్ని కొంచెం రహస్యంగా ఉండనీయండి’: రోహిత్ శర్మ
మ్యాచ్ల సమయంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో భారత సారథి రోహిత్ శర్మ చాలా సరదాగా ఉంటారు..! ఆయన విలేకర్లపై పంచులు విసురుతూ నవ్వులు పూయిస్తారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: మ్యాచ్ల సమయంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో భారత సారథి రోహిత్ శర్మ చాలా సరదాగా ఉంటాడు..! విలేకర్లపై పంచులు విసురుతూ నవ్వులు పూయిస్తాడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. శనివారం రోహిత్ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థానీ జర్నలిస్టు నుంచి భారత ఓపెనింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘గత కొన్ని సిరీసుల నుంచి భారత్ కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. కొన్ని సార్లు పంత్ వస్తే.. మరికొన్ని సార్లు సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడు. కేఎల్ రాహుల్ లేకపోవడంతోనే ఇలా చేస్తున్నారా..? ఇప్పుడతడు వచ్చేశాడుగా. అతడి స్థానంలోనే వస్తాడా లేదా రేపు మీతోపాటు కొత్త ఓపెనింగ్ భాగస్వామి కనిపిస్తాడా..?’’అని అడిగాడు.
మ్యాచ్ వ్యూహాన్ని బయటకు వెల్లడించేందుకు ఇష్టపడని హిట్మ్యాన్.. సరదాగా ఆ ప్రశ్నను దాటవేశాడు. ‘‘ఆదివారం టాస్ వేశాక మీరే చూడండి.. ఎవరు వస్తారో. మమ్మల్ని కూడా కొన్ని రహస్యాలను దాచుకోనీయండి మిత్రమా. మేం కొత్తవి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. వాటిల్లో కొన్ని పని చేస్తే.. మరికొన్ని ఫలితాన్ని ఇవ్వవు. ప్రయత్నించడంలో తప్పులేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కొత్తవి ప్రయత్నిస్తాం’ అని రోహిత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇంకో పది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ అవతరిస్తాడు. ప్రస్తుతం 3,487 పరుగులతో రెండు స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ 3,497 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!