RCB-WPL: ఆర్సీబీ కీలక నిర్ణయం.. మహిళా జట్టుకు మెంటార్గా సానియా మీర్జా
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన మహిళా జట్టు కోసం టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణిని మెంటార్గా నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) తొలి టోర్నీకి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం, ప్రసార హక్కుల బిడ్లు అన్నీ ముగిశాయి. ఇక మార్చి 4వ తేదీ నుంచి పోటీల సందడి మొదలు కానుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకొంది. తమ మహిళల జట్టుకు మెంటార్గా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను (Sania Mirza) నియమించింది. ఈ మేరకు ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఇటీవలే సానియా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
సానియాను మెంటార్గా నియమించడంపై ఆర్సీబీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ వి మేనన్ స్పందించారు. ‘‘ ఆర్సీబీ మహిళా జట్టుకు సానియా మీర్జాను మెంటార్గా నియమించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. కష్టపడేతత్వంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆమె సరైన వ్యక్తిగా మేం భావించాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మరీ ఈ స్థాయికి చేరింది. యువ తరానికి మార్గదర్శకంగా నిలిచే ఆమె మరింతమందిలో స్ఫూర్తిని రగిలించగలదు. కఠిన పరిస్థితుల్లో ఎలా రాణించాలనే విషయాలను యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయగలదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సానియా మీర్జా తప్పకుండా జట్టును ఉత్తమ పద్ధతిలో నడిపిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
ఆర్సీబీకి మెంటార్గా నియమించడంపై సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఆర్సీబీ మహిళా జట్టుతో కలవడం సంతోషంగా ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్తో ఉమెన్స్ క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం. ఇలాంటి మెగా లీగ్ల వల్ల చిన్నారులు క్రీడలను కెరీర్గా ఎంచుకోవడానికి మార్గమవుతుంది. మెంటార్గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంతో ఉన్నా. చాలా ఏళ్లుగా ఐపీఎల్లో ఆర్సీబీ క్రేజ్ ఉన్న జట్టు’’ అని సానియా వ్యాఖ్యానించింది. భారత టాప్ మహిళా క్రికెటర్ స్మృతీ మంధానను (Smriti Mandhana) రూ. 3.4 కోట్లు పెట్టి మరీ ఆర్సీబీ సొంతం చేసుకొంది. తమకు కేటాయించిన నిధుల్లో మూడో వంతు స్మృతీ కోసమే కేటాయించడం విశేషం. ఆర్సీబీ మహిళా జట్టుకు ప్రధాన కోచ్గా ఆసీస్కు చెందిన బెన్ స్వెయర్ను నియమించింది. ప్రస్తుతం స్వెయర్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM