RR vs RCB: రాజస్థాన్ ఆలౌట్.. బెంగళూరు సూపర్ విక్టరీ
ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు.
జైపుర్: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. హెట్మయర్ (35) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ (3/10), బ్రాస్వెల్ (2/16), కర్ణ్ శర్మ (2/19), సిరాజ్ (1/10), మ్యాక్స్వెల్ (1/3) ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీశారు.
రాజస్థాన్కు తొలి ఓవర్ నుంచే ఆర్సీబీ బౌలర్లు వరుస షాక్లు ఇచ్చారు. సిరాజ్ వేసిన మొదటి ఓవర్లో సూపర్ ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ (0) కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. పార్నెల్ వేసిన రెండో ఓవర్లో బట్లర్ (0) సిరాజ్కు చిక్కగా.. సంజు శాంసన్ (4) వికెట్ కీపర్ అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చాడు. బ్రాస్వెల్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి దేవదత్ పడిక్కల్ (4) సిరాజ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జో రూట్ (10) పార్నెల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ధ్రువ్ జురెల్ (1).. బ్రాస్వెల్ వేసిన ఏడో ఓవర్లో చివరి బంతికి మహిపాల్ లామ్రోర్కు చిక్కాడు. కర్ణ్ శర్మ వేసిన ఎనిమిదో ఓవర్లో హెట్మయర్ హ్యాట్రిక్ సిక్స్లు బాదిన తర్వాత చివరి బంతికి అశ్విన్ (0) రనౌట్ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న హెట్మయర్ మ్యాక్స్వెల్ వేసిన 9.5 బంతికి బ్రాస్వెల్కు క్యాచ్ ఇచ్చాడు. కర్ణ్ వేసిన 11 ఓవర్లో ఆడమ్ జంపా (2) క్లీన్బౌల్డ్ కాగా.. కేఎం ఆసిఫ్ (0) కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో రాజస్థాన్ ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ (55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ (54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో అనుజ్ రావత్ (29*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు స్కోరు 170 దాటింది. విరాట్ కోహ్లీ (18) పరుగులు చేయగా.. మహిపాల్ లామ్రోర్ (1), దినేశ్ కార్తిక్ (0) విఫలమయ్యారు. మైఖేల్ బ్రాస్వెల్ (9*) నాటౌట్గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆసిఫ్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..