Cricket news: ఒకే ఓవర్లో 6, 6, 6, 6, 4, 6.. అదరగొట్టిన జింబాబ్వే బ్యాటర్
బంగ్లాదేశ్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో జింబాంబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు సహా ఓ ఫోర్తో మొత్తంగా 34 పరుగులు సాధించాడు........
(ఫొటో సోర్స్: జింబాబ్వే క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ సెన్సేషనల్ బ్యాటింగ్ అదరగొట్టేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు సహా ఓ ఫోర్తో మొత్తంగా 34 పరుగులు సాధించాడు. స్పిన్నర్ నసుమ్ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో బర్ల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన ర్యాన్.. ఆ తర్వాతి బంతికి ఫోర్ సాధించాడు. తర్వాతి బంతికి ఏమవుతుందా అని ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదుచూస్తుండగా.. ఆరో బంతిని సైతం ప్రేక్షకుల మధ్యలోకి పంపాడు. దీంతో ఒకే ఓవర్లో 34 పరుగులు సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
అంతకంటే ముందు భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఆపై విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ సైతం శ్రీలంక బౌలర్ అకిల ధనంజయపై విరుచుకుపడి 36 పరుగులు రాబట్టాడు. భారత యువ ఆటగాడు శివమ్ దూబే బౌలింగ్లో న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సైఫర్ట్ 34 పరుగులు సాధించగా.. తాజాగా ర్యాన్ బర్ల్ ఆ జాబితాలో చేరాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను జింబాబ్వే 2-1తేడాతో కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్ల్లో చెరో జట్టు గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఆతిథ్య జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. బర్ల్ (28 బంతులకు 54), న్యూచీ (20 బంతుల్లో 35) విజృంభించడంతో జట్టు స్కోరు 156కు చేరింది. ఆపై ఛేదనకు దిగిన బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు