Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
వరల్డ్ కప్ (ODI World Cup 2023) ప్రారంభానికి ముందే మాజీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. కివీస్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరో వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది. మెగా టోర్నీల్లో టీమ్ఇండియా ప్రదర్శనపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ సీమర్ శ్రీశాంత్ అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడు. పెద్ద టోర్నీల్లో టీమ్ఇండియా దూకుడుగా ఆడలేదని సైమన్ ఇటీవల వ్యాఖ్యానించగా.. ఇలాంటి మాటలు విరాట్ కోహ్లీ చెవినపడితే మీ పని అంతేనని శ్రీశాంత్ బదులిచ్చాడు. ఇతరుల గురించి మాట్లాడే ముందు.. మీ జట్టు పరిస్థితిని కూడా గమనించుకోవాలని సూచించాడు.
‘‘వరల్డ్ కప్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్కు వస్తోంది. టీమ్ఇండియా దూకుడుగా ఆడుతుందా..? లేదా? అనేది వారికి తెలుస్తుంది. తప్పకుండా వారిని చిత్తు చేస్తుంది. 2019లో లక్కీగా న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకుంది. అదీనూ సెమీస్లో ఎంఎస్ ధోనీ రనౌట్ కావడం వల్లే. లేకపోతే అక్కడికి కష్టమయ్యేది. ఫైనల్లో విజేతగా నిలిచిందా? అంటే అదీ లేదు. ఇంగ్లాండ్కు కప్ను అప్పగించింది. ఇప్పటి వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ను మాత్రం న్యూజిలాండ్ దక్కించుకోలేదు. అందుకే, ఎదుటి జట్టు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేసేముందు మీ సంగతి కూడా ఓ సారి ఆలోచించుకోవాలి. అవతలివారికి పంచ్ ఇవ్వాలని భావిస్తే.. వారు తిరిగిచ్చే పంచ్ను కూడా స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
ఈ ప్రపంచకప్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అప్పుడు కివీస్కు టీమ్ఇండియా షాక్ ఇవ్వడం ఖాయం. ఈసారి న్యూజిలాండ్ గుణపాఠాలు నేర్చుకొంటుంది. గత ఐసీసీ ఈవెంట్లలో మాపై కొన్ని విజయాలు నమోదు చేసింది. ఆ రోజులు ముగిశాయి. ఇంకా ఏదైనా వ్యాఖ్యలు చేద్దామని భావిస్తే మాత్రం విరాట్ కోహ్లీని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఏమన్నారో అతడి దృష్టికి వెళ్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అప్పుడు పోటీ ఇంకా రసవత్తరంగా ఉంటుంది’’ అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.
అక్టోబర్ 5న న్యూజిలాండ్- ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్తో వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ప్రారంభం కానుంది. అయితే, ఆలోపు అన్ని జట్లూ వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. భారత్ కూడా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్తో వార్మప్ మ్యాచ్లను ఆడనుంది. అక్టోబర్ 22న భారత్-కివీస్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Maxwell: నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
IND w Vs ENG w: సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
Ravi Bishnoi: టీ20ల్లో బిష్ణోయ్ నంబర్వన్
భారత యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్వన్ బౌలర్గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్. -
Pro Kabaddi League: టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. -
Shubman Gill: గిల్ 400 చేయగలడు
sక్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ బద్దలు కొడతాడని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. -
దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
సొంతగడ్డపై టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. -
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్రౌండర్ల కొరత
అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్ వల్లే నాణ్యమైన ఆల్రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్. చరిత్రలోనూ ఆల్రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. -
ఒక్క రోజే 15 వికెట్లు
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. -
వోజ్నియాకికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్కార్డ్
మహిళల మాజీ నంబర్వన్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్)కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్లో వైల్డ్కార్డ్ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్కార్డులు ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం