సచిన్కు సలామ్.. ధోనీతో హైటెన్షన్!
సచిన్ తెందుల్కర్.. ఓ పరుగుల యంత్రం, ప్రపంచ క్రికెట్లో సంచలనం. ప్రత్యర్థి ఎవరైనా, సహచరులు వెనుదిరుగుతన్నా తనకి తెలిసిన మంత్రం ఒక్కటే..
చరిత్ర మొదలై నేటికి 11 ఏళ్లు
సచిన్ తెందుల్కర్.. ఓ పరుగుల యంత్రం, ప్రపంచ క్రికెట్లో సంచలనం. ప్రత్యర్థి ఎవరైనా, సహచరులు వెనుదిరుగుతన్నా తనకి తెలిసిన మంత్రం ఒక్కటే.. పరుగుల వరద పారించడం. 16 ఏళ్ల వయసులోనే రికార్డుల వేటను మొదలుపెట్టిన సచిన్కు నేడు ప్రత్యేకమైన రోజు. ద్విశతక చరిత్రకు అతడు నాంది పలికి నేటితో సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యాయి.
2010, ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. అయితే అతడు ద్విశతకం సాధిస్తున్న సమయంలో క్రికెట్ ప్రపంచమంతా మునివేళ్ల మీద నిలబడింది. ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ అతడికి ఎక్కువ స్ట్రైకింగ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తెందుల్కర్ 200 సాధిస్తాడా లేదానని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మొత్తంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సచిన్ సాధించాడు. ఆ మధుర క్షణాలను మాస్టర్ బ్లాస్టర్ ఎలా అందుకున్నాడంటే..
2010లో భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది. కానీ మూడు వన్డేల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో టీమిండియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకుందామని రెండో వన్డేలో బరిలోకి దిగిన సఫారీలకు మరోసారి చుక్కెదురైంది. ఆదిలోనే సెహ్వాగ్ను ఔట్ చేసిన ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. వన్డౌన్లో వచ్చిన దినేశ్ కార్తీక్తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 194 పరుగులు జోడించారు. కార్తీక్ ఔటైన అనంతరం యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించి వెనుదిరిగాడు. అప్పటికీ సచిన్ 150 పూర్తిచేసుకున్నాడు.
ధోనీతో టెన్షన్ టెన్షన్..
పఠాన్ ఔటైన తర్వాత ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకుంటూ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 ఓవర్లకు సచిన్ 190 పరుగులు పూర్తిచేశాడు. కానీ 191 నుంచి ఒక్కో పరుగు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరోవైపు చూస్తుండగానే ధోనీ 17 పరుగుల నుంచి 60 పరుగులు పూర్తిచేశాడు. స్ట్రైకింగ్ ఎక్కువ రాకపోవడంతో సచిన్ మాత్రం 199లోనే ఉన్నాడు. భారత్ ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ వచ్చేసింది. అభిమానుల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.
50వ ఓవర్లో తొలి బంతిని ధోనీ సిక్సర్ బాదాడు. తర్వాత బంతికి సింగిల్ తీయడంతో సచిన్కు స్ట్రైకింగ్ వచ్చింది. లాంగ్వెల్డ్ మూడో బంతిని ఆఫ్స్టంప్ అవతలకు విసిరాడు. సచిన్ ఫీల్డర్ల మధ్యలో నుంచి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బాది సింగిల్ తీసి ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను అందుకున్న సచిన్ మరో అద్భుతాన్ని సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది అభిమానులకి. మీ అందరికీ ధన్యవాదాలు. ‘సచిన్.. సచిన్..’ అంటూ మీరు చేసే నినాదాలు తుది శ్వాస వరకు నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి- సచిన్
ఇప్పటివరకు వన్డేల్లో సచిన్ తర్వాత ఏడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో నాలుగు భారత ఆటగాళ్లవే. 2011లో వెస్టిండీస్పై సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ బాదాడు. ఆసీస్పై ఒకసారి, శ్రీలంకపై రెండు సార్లు ద్విశతకం చేశాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, కివీస్ ఆటగాడు గప్తిల్, పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫకర్ జమాన్ కూడా ద్విశతకాన్ని అందుకున్నారు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు