Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
మూడు సెంచరీలు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా మారిన శుభ్మన్ గిల్ (Shubman Gill) ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోసారి ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ క్రమంలో గిల్ను క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) మ్యాచ్ సందర్భంగా రెండు అంశాలు హాట్ టాపిక్గా మారాయి. అందులో ఒకటి వర్షం. రెండోది సెంచరీలతో మోతమోగిస్తున్న గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఫైనల్ నేటికి వాయిదా పడింది. ఇవాళ కూడా వరుణుడి ముప్పు తప్పదనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వర్షం తగ్గి మ్యాచ్ జరిగితే మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను అడ్డుకోవడానికి చెన్నై బౌలర్లు కాస్త కష్టపడాల్సిందే. బెంగళూరు, ముంబయి జట్లపై సెంచరీలు సాధించిన గిల్పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కీలకమైన రెండో క్వాలిఫయర్లో ముంబయిపై అలవోకగా శతకం బాదేశాడు. ఈ క్రమంలో ముంబయి మెంటార్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా గిల్ ప్రదర్శనపై అభినందనలు తెలిపాడు. బ్యాటింగ్లో దూకుడు.. మైదానంలో ప్రశాంతంగా ఉండే లక్షణాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు.
‘‘ఈ సీజన్లో శుభ్మన్ గిల్ ప్రదర్శన అద్భుతం. కీలక సమయంలో చేసిన రెండు శతకాలను ఎప్పటికీ మరిచిపోలేం. అందులో ఒకటి ముంబయి ఆశలను బతికించగా.. మరొకటి విపరీతంగా దెబ్బ తీసిన సెంచరీ కావడం విశేషం. క్రికెట్ స్వభావం అలానే ఉంటుంది. శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు.. దూకుడుగా ఆడాలనే స్వభావం, ఎంతో ప్రశాంతంగా ఆడటం, పరుగుల కోసం తాపత్రయం, వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం గిల్ను ప్రత్యేకంగా నిలిపాయి’’ అని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఈ సీజన్లో 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అతడికి దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. అయితే, ఫైనల్లోనూ మరో 122 పరుగులు చేస్తే ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ(973) రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: నా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడడు: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఐపీఎల్లో ముంబయి జట్టుతో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 17వ సీజన్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. -
Ashwin: స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: అశ్విన్
టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. మొత్తం 26 వికెట్లు తీసి టాపర్గా నిలిచాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
-
PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్కు ప్రధాని మోదీ విషెస్
-
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే