Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
మూడు సెంచరీలు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా మారిన శుభ్మన్ గిల్ (Shubman Gill) ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోసారి ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన చేయాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ క్రమంలో గిల్ను క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) మ్యాచ్ సందర్భంగా రెండు అంశాలు హాట్ టాపిక్గా మారాయి. అందులో ఒకటి వర్షం. రెండోది సెంచరీలతో మోతమోగిస్తున్న గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఫైనల్ నేటికి వాయిదా పడింది. ఇవాళ కూడా వరుణుడి ముప్పు తప్పదనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వర్షం తగ్గి మ్యాచ్ జరిగితే మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను అడ్డుకోవడానికి చెన్నై బౌలర్లు కాస్త కష్టపడాల్సిందే. బెంగళూరు, ముంబయి జట్లపై సెంచరీలు సాధించిన గిల్పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కీలకమైన రెండో క్వాలిఫయర్లో ముంబయిపై అలవోకగా శతకం బాదేశాడు. ఈ క్రమంలో ముంబయి మెంటార్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా గిల్ ప్రదర్శనపై అభినందనలు తెలిపాడు. బ్యాటింగ్లో దూకుడు.. మైదానంలో ప్రశాంతంగా ఉండే లక్షణాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు.
‘‘ఈ సీజన్లో శుభ్మన్ గిల్ ప్రదర్శన అద్భుతం. కీలక సమయంలో చేసిన రెండు శతకాలను ఎప్పటికీ మరిచిపోలేం. అందులో ఒకటి ముంబయి ఆశలను బతికించగా.. మరొకటి విపరీతంగా దెబ్బ తీసిన సెంచరీ కావడం విశేషం. క్రికెట్ స్వభావం అలానే ఉంటుంది. శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు.. దూకుడుగా ఆడాలనే స్వభావం, ఎంతో ప్రశాంతంగా ఆడటం, పరుగుల కోసం తాపత్రయం, వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం గిల్ను ప్రత్యేకంగా నిలిపాయి’’ అని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఈ సీజన్లో 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అతడికి దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. అయితే, ఫైనల్లోనూ మరో 122 పరుగులు చేస్తే ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ(973) రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్