2011 Final: సచిన్ సెంటిమెంట్.. 2011 ఫైనల్ చూడలేకపోయిన సెహ్వాగ్
టీమ్ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ సాధించి అప్పుడే 11 ఏళ్లు గడిచాయి. శ్రీలంకపై నాటి సారథి మహేంద్రసింగ్ ధోనీ (91 నాటౌట్; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాకు ఈ రోజు మరిచిపోలేని రోజు. ఎందుకంటే రెండోసారి వన్డే ప్రపంచకప్ సాధించి నేటికి 11 ఏళ్లు. శ్రీలంకపై నాటి సారథి మహేంద్రసింగ్ ధోనీ (91 నాటౌట్; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ముఖ్యంగా నువాన్ కులశేఖర వేసిన 48.2 బంతిని మహీ సిక్సర్గా మలిచిన తీరు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆ అపురూప క్షణాలను మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా అభివర్ణించిన మాటలు మన చెవ్వుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఈ మ్యాచ్లో లంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు జీవితాశయం కూడా.
కాగా, ఈ మ్యాచ్కు సంబంధించి సచిన్, సెహ్వాగ్ల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే అది సచిన్ సెంటిమెంట్కు సంబంధించినది. ఇది చాలా సరదా విషయమే అయినా మనలో చాలా మందికి తెలిసి ఉండదు. అసలేం జరిగిందంటే.. నాటి ఫైనల్ మ్యాచ్లో ఈ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. జట్టు స్కోర్ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. మలింగ నిప్పులు చెరిగే బంతులకు సెహ్వాగ్ (0), సచిన్ (18) పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నా.. వీరిద్దరూ చూడలేకపోయారు. అందుకు సచినే కారణం.
సచిన్ డ్రెస్సింగ్ రూమ్కి చేరాక తనతో పాటు సెహ్వాగ్నూ మిగిలిన మ్యాచ్ను చూడనివ్వలేదు. ఈ విషయాన్ని తెందూల్కరే ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించాడు. ‘‘అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రోజు.. నేను డ్రెస్సింగ్రూమ్లో తలకు మసాజ్ చేసుకుంటుండగా వీరూ నా పక్కనే కూర్చున్నాడు. ఆరోజు టీమ్ఇండియా బాగా ఆడి విజయం సాధించింది. దాంతో ఫైనల్ రోజు కూడా నేను ఔటయ్యాక వెళ్లి మసాజ్ టేబుల్ మీద కూర్చున్నాను. నా పక్కనే సెహ్వాగ్నూ కూర్చోమని చెప్పా. అప్పుడు అతడు.. ‘కొంచెంసేపైనా నన్ను మ్యాచ్ చూడనివ్వు’ అని అడిగాడు. నేను కుదరదని చెప్పా. కావాలంటే తర్వాత ఎన్నిసార్లు అయినా టీవీలో ఈ మ్యాచ్ను చూసుకో అని చెప్పాను. చివరికి మేం విజయం సాధించాం’ అని సచిన్ నాటి సరదా సంఘటనను బయటపెట్టాడు.
ఇక ఆ మ్యాచ్లో వీరిద్దరూ ఔటయ్యాక గౌతమ్ గంభీర్ (97; 122 బంతుల్లో 9x4), విరాట్ కోహ్లీ (35; 49 బంతుల్లో 4x4) మూడో వికెట్కు 83 పరుగులు జోడించారు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. గంభీర్తో కలిసి నాలుగో వికెట్కు 109 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలోనే గంభీర్ శతకానికి చేరువైన వేళ ఔటయ్యాడు. అయితే, తర్వాత యువరాజ్ (21 నాటౌట్; 24 బంతుల్లో 2x4)తో కలిసి ధోనీ మ్యాచ్ను పూర్తి చేశాడు. దీంతో భారత్కు అతిగొప్ప విజయం అందించాడు. కాగా, ఈ మ్యాచ్లో ధోనీ ఉపయోగించిన బ్యాట్ను తర్వాత వేలం వేయగా.. అది రికార్డు ధర పలికింది. అప్పట్లో ఆర్కే గ్లోబల్ అనే సంస్థ దీన్ని రూ.72 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని ధోనీ భార్య సాక్షికి చెందిన ఓ ఛారిటబుల్ ట్రస్టుకు వినియోగించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ