sachin tendulkar: ఈ గెలుపు మీకే అంకితం: సచిన్‌ భావోద్వేగం

సచిన్‌ తెందూల్కర్‌ తన జట్టు సభ్యులను కొనియాడాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు.

Published : 03 Oct 2022 01:23 IST

దిల్లీ: రోడ్‌ సేఫ్టీ టీ20 ప్రపంచ సిరీస్‌ను రెండో సారి కైవసం చేసుకున్న భారత లెజెండ్స్‌ జట్టు సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ తన జట్టు సభ్యులను కొనియాడాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు.  ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన నమన్‌ ఓజా ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు. 

‘‘మ్యాచ్‌ గెలిచేందుకు జట్టు ఎంతగానో కృషి చేసింది. చివరి మ్యాచ్‌లో ఓజా బ్యాటింగ్‌ మరో అద్భుతం. ఈ గెలుపును నా జట్టుకు, అభిమానులకు అంకితం ఇస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌ అనంతరం జట్టు విజయోత్సాహాలు జరుపుకొంటున్న ఫొటోలను ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ నెటిజన్లతో పంచుకున్నాడు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని