Sachin Tendulkar: అర్జున్పై ఆ ఒత్తిడి వద్దు.. కుమారుడి తొలి శతకంపై స్పందించిన సచిన్
అర్జున్ ఆటలో రాణించాలంటే అతడు ముందుగా క్రికెట్తో ప్రేమలో పడాలని సచిన్(Sachin Tendulkar) తెలిపాడు. అందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు.
దిల్లీ: గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న అర్జున్ తెందూల్కర్ గుజరాత్పై తన తొలి మ్యాచ్లో రంజీ శతకాన్ని నమోదు చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు, సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 1988 రంజీ(Ranji Trophy) అరంగేట్ర మ్యాచ్లో సచిన్ తెందూల్కర్ సైతం ఇదే విధంగా శతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడి విషయంలో సచిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్(Arjun Tendulkar)పై ఒత్తిడి లేకుండా చూసేందుకే తాను ప్రయత్నిస్తానని అన్నాడు. అందరిలాగా తన కుమారుడు సాధారణ బాల్యం గడపలేదని తెలిపాడు. అతడు క్రికెట్ను ఇంకా ఆస్వాదించాలని.. ఇప్పుడే అంచనాల పేరుతో అతడిని ఒత్తిడికి గురిచేయడం తనకు ఇష్టం లేదని సచిన్(Sachin Tendulkar) పేర్కొన్నాడు.
‘‘మ్యాచ్లో అతడి ప్రదర్శన తర్వాత ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అవన్నీ అర్జున్ను ఒత్తిడికి గురిచేస్తాయి. ఎందుకంటే, నేను మా తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ అటువంటిది ఎదుర్కోలేదు. నాకు నచ్చింది చేసే స్వేచ్ఛను వారు ఇచ్చారు. అందుకే నాపై ఒత్తిడి ప్రభావం ఉండేదికాదు. వారి మద్దతు, ప్రోత్సాహాన్ని మాత్రమే నాకు అందించేవారు. అది నన్ను నేను మరింత మెరుగుపరిచేందుకు తోడ్పడింది. నా కుమారుడి విషయంలోనూ నేను అదే చేయాలనుకుంటాను. నాలాంటి ఓ క్రికెట్ సెలబ్రిటీ కుమారుడిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నేను తనకెప్పుడూ అదే చెప్తుంటాను. అర్జున్ను క్రికెట్తో ప్రేమలో పడనివ్వండి. అందుకు అతడికి కొంత సమయం ఇవ్వండి. ఆట నుంచి రిటైర్మెంట్ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నేను ఇదే సందేశాన్ని ఇచ్చాను’’ అంటూ సచిన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం