Sachin - Kohli: కోహ్లీ ఇచ్చిన విలువైన బహుమతి అతడికే తిరిగిచ్చా: సచిన్
సచిన్ తెందూల్కర్ ఎంతో మంది క్రికెటర్లకు, యువకులకు స్ఫూర్తిదాయకమైన ఆటగాడు. అలాంటి దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరికి 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు...
ఇంటర్నెట్డెస్క్: సచిన్ తెందూల్కర్ ఎంతో మంది క్రికెటర్లకు, యువకులకు స్ఫూర్తి. అలాంటి దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరికి 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అది యావత్ క్రికెట్ ప్రేమికులతో పాటు సచిన్కు కూడా అత్యంత బాధాకరమైన రోజుగా మిగిలింది. కాగా, అప్పుడు జట్టులో యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ.. తనకు ఓ విలువైన బహుమతి ఇచ్చాడని సచిన్ గుర్తుచేసుకున్నాడు. అయితే, దాన్ని కొద్దిసేపే తన వద్ద పెట్టుకొని తర్వాత అతడికే తిరిగి ఇచ్చేసినట్లు చెప్పాడు. అది తన జీవితంలో ఓ మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నాడు. తాజాగా ఓ అమెరికన్ జర్నలిస్ట్తో యూట్యూబ్లో మాట్లాడిన క్రికెట్ దిగ్గజం నాటి విశేషాల్ని ఇలా పంచుకున్నాడు.
‘‘ఆ రోజు నేను డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని టవల్తో కళ్లను తుడుచుకుంటూ కూర్చున్నా. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అప్పుడే కోహ్లీ నా వద్దకు వచ్చి ఒక పవిత్రమైన దారం ఇచ్చాడు. అది కోహ్లీకి వాళ్ల నాన్న ఇచ్చాడట. అయితే, దాన్నే నాకు ఎందుకు ఇచ్చాడో కూడా వివరించాడు. ‘మన దేశంలో చాలా మంది మణికట్టు వద్ద ఇలాంటి పవిత్రమైన దారాలు కట్టుకుంటారు. అలానే నాకూ ఈ దారాన్ని మా నాన్న ఇచ్చాడు. దాన్ని నేను ఎప్పుడూ నా బ్యాగ్లోనే పెట్టుకుంటాను. నా వద్ద ఉన్న అత్యంత విలువైనది ఇదేనని అనుకుంటున్నా. అందుకే దీన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇంతకుమించింది నాతో ఏదీ లేదు. మీరు నాతో పాటు ఎంత మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారో తెలియజేసేందుకే మీకు ఈ దారం ఇవ్వాలనుకున్నా’ అని కోహ్లీ నాతో వివరించాడు’’ అని సచిన్ గుర్తుచేసుకున్నాడు.
‘‘ఇక నేను ఆ దారాన్ని కొద్దిసేపు నాతో పెట్టుకొని తిరిగి కోహ్లీకే ఇచ్చాను. అదెంతో విలువైనదని.. దాన్ని అతడి వద్దే పెట్టుకోమని, వేరే ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పాను. అది మీ నాన్న ఇచ్చిన జ్ఞాపకం. నీ చివరి క్షణాల వరకూ నీతోనే ఉంచుకో’ అని కోహ్లీతో చెప్పినట్లు సచిన్ వివరించాడు. అదొక భావోద్వేగభరితమైన సంఘటన అని.. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అని సచిన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు