Sachin Tendulkar: సచిన్ భారీ సిక్స్.. 1998 రోజుల్ని గుర్తుచేస్తోన్న మాస్టర్ బ్లాస్టర్
మైదానంలో మెరుపులు.. కళ్లు చెదిరే సిక్సులు.. తనదైన ట్రేడ్మార్క్ షాట్లు.. ఇలా ఒకప్పటి సచిన్ను ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ మనముందుకు తీసుకువస్తోంది
(ఫొటో : రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో మెరుపులు.. కళ్లు చెదిరే సిక్సులు.. తనదైన ట్రేడ్మార్క్ షాట్లు.. ఇలా ఒకప్పటి సచిన్ను ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ మనముందుకు తీసుకువస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న ఈ సిరీస్లో సచిన్ ‘ఇండియా లెజెండ్స్’కు సారథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. 49 ఏళ్ల వయసులోనూ బ్యాట్తో మైదానంలో ఆనాటి మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో ఈ మాస్టర్ బ్లాస్టర్ మరోసారి తన సత్తా చాటాడు.
ఇంగ్లాండ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 20 బంతుల్లో 40 పరుగులు చేసి సచిన్ ఔరా అనిపించాడు. ఇందులో అబ్బురపరిచే మూడు భారీ సిక్సులు ఉండటం మరో విశేషం. క్రిష్ ట్రెమ్లెట్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు, ఒక ఫోరు బాది ప్రత్యర్థి ఫీల్డర్లతోపాటు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఓవర్లో సచిన్ కొట్టిన రెండో సిక్స్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. 1998లో షార్జాలో ఆడిన ఇన్నింగ్స్లోని షాట్తో ఇప్పుడు అతడు కొట్టిన సిక్స్ను పోల్చుతూ అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ను
మెచ్చుకుంటున్నారు. ఇక 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ లెజెండ్స్ 6 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’