Sachin: ఆ వ్యక్తి నుంచి నా తప్పు తెలుసుకున్నా
జీవితంలో ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు బయోబబుల్, క్వారంటైన్ వంటి నిబంధనలతో తీవ్ర మానసిక...
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు బయో బబుల్, క్వారంటైన్ నిబంధనలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అన్అకాడమీ’ అనే ఆన్లైన్ విద్యాబోధన సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెందూల్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లోని పలు ఆసక్తికరమైన విషయాలు అందరితో పంచుకున్నారు. ఆటకు సన్నద్ధమవ్వడం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
‘నా కెరీర్లో కొంతకాలం తర్వాత ఆటకు సన్నద్ధమవడం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ సిద్ధమవ్వాలని తెలుసుకున్నా. మ్యాచ్ ప్రారంభానికి ముందు తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడిని. 10-12 ఏళ్ల పాటు ఎంతో మానసిక క్షోభ అనుభవించా. మ్యాచ్కు ముందు రోజు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. తర్వాత అది కూడా నా సన్నద్ధంలో ఒక భాగమని తెలుసుకున్నా. దాంతో మానసిక ప్రశాంతత సంపాదించా. నిద్ర పట్టనప్పుడు ఏదో ఒక పని చేసి బుర్రకు పనిచెప్పేవాడిని. అలాంటి సమయంలో సొంతంగా చాయ్ తయారు చేసుకోవడం.. బట్టలు ఇస్త్రీ చేసుకోవడం లాంటివి అలవాటు చేసుకున్నా. దాంతో అవి కూడా నా సన్నద్ధ ప్రక్రియలో భాగమయ్యాయి. నా చివరి మ్యాచ్ సందర్భంగా ఆఖరి రోజు కూడా ఇదే అలవాటును కొనసాగించా’ అని సచిన్ చెప్పుకొచ్చారు.
కెరీర్లో ఎదురయ్యే ఒడుదొడుకులనేవి ఆటగాళ్లకు సహజమేనని సచిన్ అన్నారు. ఎవరి కెరీర్లో అయినా ఇలాంటివి ఉంటాయని చెప్పారు. కానీ, ఆటగాళ్లు ఎప్పుడైతే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారో అప్పుడు వాస్తవాన్ని అంగీకరించాలని సూచించారు. ఆ సమయంలో ఆత్మీయులు తోడుగా ఉండాలన్నారు. అప్పుడు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలోనే విజయం దాగుందని చెప్పారు. అలాంటప్పుడు చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనోధైర్యం కల్పించాలన్నారు. అది తెలుసుకుంటే ఆటగాళ్లే తమ సమస్యల పరిష్కారానికి జవాబు వెతుక్కోగలరని పేర్కొన్నారు. చివరగా తాను నేర్చుకున్న ఓ జీవిత పాఠాన్ని పంచుకున్న తెందూల్కర్.. ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని చెప్పారు. తాను ఆడే రోజుల్లో ఒకసారి చెన్నైలోని ఓ హోటల్లో బస చేసినప్పుడు అక్కడి సిబ్బంది ఒకరు తన బ్యాటింగ్కు సంబంధించి ఓ సలహా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ‘ఆ వ్యక్తి నా గదికి దోశ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. తర్వాత నాకో సూచన చేశాడు. నా మోచేతికి ధరించే గార్డ్.. బ్యాట్ ఆడించేటప్పుడు ఇబ్బందిగా మారుతుందని చెప్పాడు. అతడు నిజంగానే నా బ్యాటింగ్ సమస్యను గుర్తించాడు. దాంతో నా తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నా’ అని సచిన్ అసలు విషయం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం