Sachin Tendulkar: రూట్ నం.315.. బాల్యంలో సచిన్ తిరిగిన బస్ ఇదే.!
వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్....
ఇంటర్నెట్ డెస్క్: వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. తాజాగా తను బాల్యంలో ప్రయాణించిన రూట్ నం.315 ముంబయి లోకల్ బస్లో ఎక్కి బాల్య స్మృతులను నెమరు వేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నాడు. సచిన్ పంచుకున్న ఆ వీడియోను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ అనుభవాలనూ పంచుకుంటున్నారు.
ముంబయిలోని శివాజీ పార్క్లో సచిన్ తెందూల్కర్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్న విషయం క్రికెట్ అభిమానులను విధితమే. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కోచింగ్లో సచిన్ ప్రపంచ స్థాయి క్రికెటర్గా ఎదిగాడు. అక్కడి నుంచి సచిన్ క్రికెట్లో సాధించిన ఘనతల గురించి, టీమ్ఇండియాకు అందించిన మరుపురాని విజయాల గురించి మనందరికీ తెలిసిందే.
సచిన్ పోస్ట్పై మాజీ క్రికెటర్ దిలీప్ జోషీ..‘బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికి మించిన మధురానుభూతి మరోటి లేదు. బాల్య స్మృతులను నెమరు వేసుకుంటే వచ్చే సంతోషానికి మరేది సాటిరాదు’ అని కామెంట్ చేశాడు. ‘చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు.. క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్కి ధన్యవాదాలు’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు