SAFF U19 Championship: నేపాల్ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్తో ఢీ
శాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో నేపాల్ను ఓడించింది.
ఇంటర్నెట్ డెస్క్: శాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్ పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో నేపాల్ను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్ టై బ్రేకర్కు వెళ్లింది. సాహిల్ ఖుర్షీద్ (26వ నిమిషంలో) గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపాడు. నేపాల్ ఆటగాడు సమీర్ తమాంగ్ (74వ నిమిషం) గోల్ చేసి స్కోరు సమం చేశాడు.
ఇక పెనాల్టీ షూటౌట్లో 2-2తో ఇరుజట్లు హోరాహోరీగా తలపడుతున్న వేళ భారత ఆటగాడు మంగ్లెన్తాంగ్ కిప్జెన్ బంతిని ఎలాంటి తడబాటు లేకుండా గోల్ పోస్ట్లోకి పంపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున కిప్జెన్తో పాటు అర్జున్ సింగ్, గోయరీ గోల్స్ చేశారు. 66వ నిమిషంలో కెప్టెన్ ఇషాన్ శిశోడియా స్థానంలో రిప్లేస్మెంట్గా వచ్చిన కిప్జెన్ గోల్కొట్టి జట్టును గెలిపించడం ఆసక్తికరం. భూటాన్తో జరిగిన మరో సెమీ ఫైనల్లో పాకిస్థాన్ 6-5 తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
డబ్ల్యూపీఎల్ వేలం (WPL 2024 Auction) నిర్వహణకు ప్లేయర్ల జాబితా, ఫ్రాంచైజీలు సిద్ధం. ఇలాంటి కీలకమైన కార్యక్రమం నిర్వహించాలంటే ఆక్షనీర్ కూడా యాక్టివ్గా ఉండటంతోపాటు ప్లేయర్లపై అవగాహన ఉండాలి. మరి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించబోయే మల్లికా సాగర్ గురించి తెలుసుకుందాం.. -
Gautham Gambhir: మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్
ముక్కుసూటిగా మాట్లాడుతూ.. అవతలి వారు ఎవరైనా సరే దూకుడుగా వ్యవహరించే స్వభావం గౌతమ్ గంభీర్ది (Gautam Gambhir). సహచరులైనా.. ప్రత్యర్థులైనా ఒకేలా స్పందిస్తూ ఉంటాడు. -
World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?
ఇటీవల వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
AB de Villiers: అందుకే త్వరగా ఆటకు వీడ్కోలు పలికా: ఏబీడీ
మైదానంలో అన్ని వైపులా ఎడాపెడా షాట్లు బాదే ఏబీ డివిలియర్స్కు 360 డిగ్రీల ఆటగాడని పేరు. భీకర ఫామ్లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడీ దక్షిణాఫ్రికా స్టార్. -
IND vs SA: సఫారీ సవాలుకు సై
ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్లో ఓడించింది.. న్యూజిలాండ్ను ఆ దేశంలోనే మట్టికరిపించింది.. ఆస్ట్రేలియా గడ్డపై విజయకేతనం ఎగరేసింది. -
WPL 2024: డబ్ల్యూపీల్ను వేదికగా చేసుకుని..
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి తిరిగి భారత జట్టు తలుపు తట్టాలని భావిస్తున్నట్లు వేద కృష్ణమూర్తి తెలిపింది. -
Pro Kabaddi League: మెరిసిన మోహిత్
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మోహిత్ గోయత్ (12 పాయింట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటడంతో శుక్రవారం పుణెరి జట్టు 43- 32 తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. -
David Warner: ఎవరి అభిప్రాయాలు వాళ్లవి
ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని, ముందుకు సాగడమే తన పని అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. -
IND w Vs ENG w: ఇంగ్లాండ్ జోరును భారత్ ఆపేనా!
ఇంగ్లాండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన భారత్కు పరీక్ష. సిరీస్లో ఆశలు నిలవాలంటే శనివారం రెండో టీ20లో హర్మన్ప్రీత్ బృందం గెలవక తప్పదు. తొలి మ్యాచ్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్కు అడ్డుకట్ట వేయడం టీమ్ఇండియాకు అంత తేలికేం కాదు. -
BAN vs NZ: ఆదుకున్న ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్ (87; 72 బంతుల్లో 9×4, 4×6) ఆదుకోవడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. -
ODI WC 2023: అహ్మదాబాద్ పిచ్ ‘సాధారణం’
భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్కు ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ వికెట్ను ‘సాధారణ పిచ్’గా ఐసీసీ పేర్కొంది. -
మళ్లీ పంజాబ్ గూటికి బంగర్
టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మళ్లీ పంజాబ్స్ కింగ్స్ జట్టులో చేరాడు. వచ్చే సీజన్ కోసం పంజాబ్ డైరెక్టర్ (క్రికెట్ డెవలప్మెంట్)గా బంగర్ నియమితుడయ్యాడు. -
అర్షిన్ ఆల్రౌండ్ జోరు
అర్షిన్ కులకర్ణి (70 నాటౌట్; 3/29) ఆల్రౌండ్ జోరు ప్రదర్శించడంతో అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. -
WPL 2024: ఎవరి పంట పండేనో..?
వచ్చే ఏడాది మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ నేపథ్యంలో శనివారం మినీ వేలం నిర్వహించనున్నారు. 2023లోనే డబ్ల్యూపీఎల్ ఆరంభమైన సంగతి తెలిసిందే.


తాజా వార్తలు (Latest News)
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
-
Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి