హత్యకేసు: సుశీల్ను ‘గురు’ అనుకున్నాడు
రెజ్లర్ సుశీల్ కుమార్ను తన కుమారుడు సాగర్ ధంకర్ గురువుగా భావించేవాడని అతడి తండ్రి అశోక్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో...
ఇంటర్నెట్ డెస్క్: రెజ్లర్ సుశీల్ కుమార్ను తన కుమారుడు సాగర్ ధంకర్ గురువుగా భావించేవాడని అతడి తండ్రి అశోక్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో అతడు ఎనిమిదేళ్లుగా శిక్షణ పొందుతున్నాడని పేర్కొన్నారు. అతడిని ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు చేసుంటే స్టేడియం నుంచి పంపించేయాల్సిందని సాగర్ కుటుంబ సభ్యుడు నరేంద్ర ధంకర్ అన్నారు.
ఛత్రసాల్ స్టేడియం ప్రాంగణంలో మే4న యువ రెజ్లర్ సాగర్ ధంకడ్పై మరికొందరు రెజ్లర్లు దాడి చేశారు. అందులో సాగర్ మరణించాడు. అప్పట్నుంచి సుశీల్ కుమార్ కనిపించడం లేదు. దాడిలో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తెలియడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. కానీ సుశీల్ ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు 8 బృందాలుగా అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యే లుకౌట్ నోటీసులూ జారీ చేశారు.
‘ఛత్రసాల్లో సాగర్ ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు. సుశీల్ను అతడు గురువుగా భావించేవాడు. నా కొడుకును మహిపాల్ సత్పాల్ చేతుల్లో పెట్టాను. వాళ్లు నా కుమారుడిని మంచి రెజ్లర్గా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సాగర్ పతకాలు గెలిచాడు. అంతర్జాతీయ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఛత్రసాల్లో ఉన్నందుకు అతడు గర్వపడేవాడు. ఒక్కరోజూ శిక్షణ మిస్సయ్యేవాడు కాదు. తన గురువులకు మాట రానిచ్చేవాడు కాదు’ అని సాగర్ తండ్రి అశోక్ అన్నారు.
‘సాగర్ ఏదైనా తప్పు చేసుకుంటే అతడిని కొట్టాల్సింది. లేదా ఛత్రాసాల్ నుంచి బయటకు పంపించాల్సింది. కనీసం నన్ను లేదా అతడి తండ్రిని పిలిపించి మాట్లాడాలి. ఎందుకు అతడిని సహించలేకపోయారు? మేం సాగర్కు నచ్చజెప్పేవాళ్లం. కానీ అతడి ప్రాణాలు తీయడం మాత్రం అంగీకారయోగ్యం కాదు’ అని సాగర్ కుటుంబ సభ్యుడు నరేంద్ర ధంకర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.