Sam Curran: విమానంలో మీకు సీటు లేదు.. క్రికెటర్ శామ్ కరన్కు చేదు అనుభవం
వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ సిబ్బంది చేసిన పనికి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ (Sam Curran) తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ట్విటర్ వేదికగా తన ఆవేదనను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఐపీఎల్ (IPL 2023) మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ సిబ్బంది నిర్వాకంతో కరన్కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణించడానికి శామ్ కరన్ టికెట్ బుక్ చేసుకొన్నాడు. కానీ, ప్రయాణానికి ముందు.. కేటాయించిన సీట్ విరిగిపోయిందనే కారణంతో తనను విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదని ట్వీట్ చేశాడు.
‘‘వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతుండగా .. నాకు కేటాయించిన సీటు విరిగిపోయిందని సిబ్బంది చెప్పారు. అందులో మీరు ప్రయాణించడం కుదరదు అని తెలిపారు. ఇదంతా పిచ్చితనంగా అనిపించింది. ధన్యవాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఇలాంటి సంఘటనతో నేను దిగ్భ్రాంతికి గురి కావడంతోపాటు.. తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని కరన్ ట్వీట్ చేశాడు. అయితే శామ్ ఎక్కడికి ప్రయాణిస్తున్నాడో మాత్రం తెలియజేయలేదు.
శామ్ ట్వీట్కు వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ స్పందించింది. ‘‘హాయ్ శామ్. ఇలా జరగడం బాధాకరం. దానికి క్షమాపణలు చెబుతున్నాం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని మా హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొచ్చి ఉంటే.. వారు సంతోషంగా మరో విమానంలో సీటు కేటాయించేవారు. మీ ఫీడ్బ్యాక్ను మా కస్టమర్ కేర్ టీమ్కూ పంపొచ్చు’’ అని రిప్లై ఇచ్చింది. అయితే, కరన్కు జరిగిన సంఘటనకు సోషల్ మీడియాలో అభిమానులు మద్దతుగా నిలిచారు. గతంలో మాకూ ఇలాంటి అనుభవం ఎదురైందని, ఆ సంస్థ మేనేజ్మెంట్ సరిగా స్పందించడం లేదని కామెంట్లు చేశారు.
గత టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ కప్ గెలవడంలో శామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో హాట్ కేక్లా అమ్ముడైపోయాడు. అతడి కోసం ముంబయి, బెంగళూరు, లఖ్నవూ, చెన్నై, రాజస్థాన్, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకొంది. అప్పటి వరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ (రూ. 16.25 కోట్లు) పేరిట ఉన్న రికార్డును శామ్ అధిగమించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...