ఆ నవ్వే.. నన్ను యువీ అభిమానిని చేసింది
భారత క్రికెట్లో యువరాజ్సింగ్కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు...
మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్..
ఇంటర్నెట్డెస్క్: భారత క్రికెట్లో యువరాజ్సింగ్కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అత్యుత్తమ ఆటగాడికి తాను 2012లో అనుకోని పరిస్థితుల్లో అభిమానిని అయ్యానని అంటున్నాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్. అప్పుడు తాను యువీని విమర్శించినా అతడు మాత్రం చిరునవ్వుతోనే ఆకట్టుకున్నాడని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన మంజ్రేకర్ నాటి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
2012 టీ20 ప్రపంచకప్లో యువీకి తుది జట్టులో చోటివ్వడం తనకిష్టం లేదని మంజ్రేకర్ చెప్పాడు. అప్పటికే క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్ పూర్తి ఫిట్నెస్తో లేడని, దాంతో పొట్టి ప్రపంచకప్కు ఎంపిక చేయడం సరికాదని అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశానని గుర్తుచేశాడు. అయితే భావోద్వేగ పరిస్థితుల్లో యువీని ఎంపిక చేశారన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రపంచకప్లో యువీ ఒక మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడని, దాంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడని మంజ్రేకర్ తెలిపాడు.
‘‘మ్యాచ్ అనంతరం నేను వ్యాఖ్యాతగా ట్రోఫీల బహూకరణ జరుగుతోంది. ఆ సమయంలో యువీని చూసి కాస్త ఆందోళన చెందా. అంతకుముందు నేను చేసిన వ్యాఖ్యల పట్ల అతడు అసంతృప్తితో ఉన్నాడనుకున్నా. అతడిని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కోసం పిలిచినప్పుడు.. నన్ను చూస్తూ నవ్వుకుంటూ వచ్చాడు. అప్పుడు తనతో ‘నువ్వు ఈ జట్టులో ఉండడం కొంత మందికి ఇష్టం లేదు’’ అని చెప్పాను.
‘‘దానికి స్పందించిన యువరాజ్.. ‘అవును సర్. కొంత మంది ఇలా అన్నారని నేను కూడా విన్నా’నని చెప్పాడు. తర్వాత నన్ను చూసి నవ్వాడు. ఆ నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమర్శల్ని కూడా చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఆ నవ్వులో ఏ మాత్రం ఎగతాళి లేదు. దాన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకున్నాడు. అప్పుడు ఇంటర్వ్యూలో నాతో బాగా మాట్లాడాడు. ఆ తర్వాతే నేను యువరాజ్ను గౌరవించడం ప్రారంభించా. అతడికి అభిమానిగా మారాను’ అని మంజ్రేకర్ అసలు విషయం వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్