IND vs SA: చివరి ఓవర్ షంసి వస్తాడని తెలుసు.. అదే నా గేమ్ ప్లాన్: సంజూ శాంసన్
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 250 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 240 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 250 పరుగుల లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ వైఫల్యంతో టీమ్ఇండియా 240 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. అయితే చివర్లో సంజూ శాంసన్- శార్దూల్ ఠాకూర్ జోడీ 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్కు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే, కీలక సమయంలో ఠాకూర్ పెవిలియన్కు చేరడంతోపాటు వరుసగా మూడు వికెట్లను కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. కానీ, అటువైపు క్రీజ్లో శాంసన్ (86*) ఉండటంతో కాస్త నమ్మకంగా ఉన్నప్పటికీ.. రబాడ, ఎంగిడి కీలకమైన 38, 39వ ఓవర్లను కట్టుదిట్టంగా వేసి పరుగులను నియంత్రించి వికెట్లను కూల్చారు.
చివరి ఓవర్లో భారత్ విజయానికి 30 పరుగులు అవసరమైన వేళ.. షంసి బౌలింగ్లో సంజూ 20 పరుగులు రాబట్టగలిగాడు. అయితే, 39వ ఓవర్లో ఒక్క బంతిని కూడా సంజూ స్ట్రైక్ చేయకపోవడంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిందని విమర్శలు వచ్చాయి. రబాడ వేసిన ఆ ఓవర్లో ఏడు పరుగులే రాగా.. కనీసం ఓ 15 పరుగులు రాబట్టినా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో తన బ్యాటింగ్ ప్లాన్ గురించి సంజూ శాంసన్ వెల్లడించాడు.
‘‘మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం నాకెప్పుడూ ఇష్టమే. చివర్లో ఓ రెండు షాట్లు అనుకున్న స్థాయిలో ఆడలేదు. వచ్చే మ్యాచ్లో వాటిపై కసరత్తు చేస్తా. అయితే నా ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా ఉన్నా. వారి బౌలర్లు చాలా కట్టుదిట్టంగా వేశారు. షంసి మాత్రమే ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. అందుకే అతడిని టార్గెట్ చేశా. చివరి ఓవర్ షంసి వేస్తాడని తెలుసు. కనీసం 24 పరుగులైనా సాధించాలని అనుకొన్నా. ఓ నాలుగు సిక్స్లు బాదగలనని భావించా. అయితే, అంతకుముందు రెండు ఓవర్లను దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా వేశారు’’ అని సంజూ తెలిపాడు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని శాంసన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ సీజన్లో తొలి జట్టుగా కోల్కతా.. ‘500’ క్లబ్లోకి సునీల్ నరైన్
ఈ సీజన్లో బెంగళూరుకు రెండో ఓటమి ఎదురైంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా చేతిలో పరాజయంపాలైంది. -
ఆర్సీబీ.. ఉఫ్
సన్రైజర్స్పై ఆండ్రి రసెల్ విధ్వంసక ఇన్నింగ్స్ చూశాక.. తర్వాతి మ్యాచ్లో బ్యాటింగ్కు బాగా సహకరించే చిన్నస్వామి స్టేడియంలో, బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ను అతనెలా ఉతికారేస్తాడో అని ఆర్సీబీ అభిమానులు కంగారు పడ్డారు! కానీ శుక్రవారం రసెల్ బ్యాటందుకోవాల్సిన అవసరమే పడలేదు. -
పరాగ్ పట్టుదలతో
ఆ యువ ఆటగాడు మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు.. నిలకడ లేదనే వ్యాఖ్యలు.. అంతర్జాలంలో దూషణలు.. ఇలా ఎంతో వ్యతిరేకత! కానీ ఆ కుర్రాడు కుంగిపోలేదు. పట్టుదలతో సాగుతున్నాడు. -
హార్దిక్.. అవి పట్టించుకోవద్దు!
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమితుడైన హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ మ్యాచ్ల కోసం వెళ్లిన ప్రతి వేదికలోనూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. -
ఇదే నా అత్యుత్తమ చివరి ఓవర్
ఇప్పటిదాకా తాను వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో గురువారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్ మీద వేసిందే ఉత్తమమైందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ అవేష్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లి, గంభీర్ నవ్వుల్ నవ్వుల్..
ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య వైరం తెలిసిందే. నిరుడు లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్గా గంభీర్ ఉన్న సమయంలో.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం విదితమే. -
పోరాడి ఓడిన సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్లో దంపతులు సిక్కిరెడ్డి- సుమీత్ రెడ్డి సెమీస్ చేరారు. -
అమెరికా జట్టులో కివీస్ ఆల్రౌండర్
కోరీ అండర్సన్ గుర్తున్నాడా? ఒకప్పుడు 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతక రికార్డును నెలకొల్పిన న్యూజిలాండ్ ఆటగాడు. -
ఫైనల్లో బోపన్న జోడీ
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆటతీరుతో అదరగొడుతున్న భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరో డబుల్స్ టైటిల్కు చేరువయ్యాడు. -
పంత్ త్వరలోనే ప్రత్యేకంగా..
మధ్య ఓవర్లలో రిషబ్ పంత్ ఎలా ఆడతాడన్న దానిపై దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆధారపడిందని ఆ జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ పేర్కొన్నాడు.