Team India: ‘సాహా విషయంలో ద్రవిడ్ తప్పుగా ఏం చెప్పలేదు’
టీమ్ఇండియా క్రికెట్లో ఇప్పుడు ప్రధాన చర్చంతా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గురించే సాగుతోంది. అతడి విషయంలో గతవారం రెండు కీలక విషయాలు చోటుచేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు...
మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా క్రికెట్లో ఇప్పుడు ప్రధాన చర్చంతా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గురించే సాగుతోంది. అతడి విషయంలో గతవారం రెండు కీలక విషయాలు చోటుచేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు. అయితే, అందులో ఒకటి శ్రీలంకతో టెస్టు సిరీస్కు తనని ఎంపిక చేయని నేపథ్యంలో అందుకు దారితీసిన పరిణామాలను సాహా మీడియాకు చెప్పుకొచ్చాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తనని రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించినట్లు వెల్లడించాడు. దీనిపై ద్రవిడ్ సైతం తన అభిప్రాయాలను బహిరంగంగానే వివరించాడు. సాహాకు తాను చెప్పింది నిజమేనని ఒప్పుకొన్నాడు.
ఇక ఈ విషయంపై తాజాగా మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ స్పందించాడు. అందులో ద్రవిడ్ తప్పుగా ఏదీ మాట్లాడలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు 37 ఏళ్లు ఉన్న సాహా తన గురించి తాను ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. అతడిని టీమ్ఇండియాకు ఎంపిక చేసినా తుది జట్టులో ఉండే అవకాశం లేదని, అలాంటప్పుడు అతడిని ఎంపిక చేయడం ఎందుకని ప్రశ్నించాడు. మరోవైపు యువ కీపర్లు సైతం అందుబాటులో ఉన్నప్పుడు సాహా రిజర్వ్బెంచ్లో కూర్చోవాల్సిన అవసరం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమ్ఇండియాకు ఇప్పుడు రిషభ్ పంత్ తొలి ప్రాధాన్యం అని, దీర్ఘకాలం అతడు జట్టులో కొనసాగుతాడని శరణ్దీప్ అభిప్రాయపడ్డాడు. అలాగే అతడిని ఇంటర్వ్యూ కోసం బెదిరించిన జర్నలిస్టు పేరు కూడా వెల్లడించాలని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. అయితే, సాహ.. సదరు పాత్రికేయుడు పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయంపై బీసీసీఐ సంప్రదించినా అతడి పేరు చెప్పలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శరణ్దీప్.. ఆ జర్నలిస్టు పేరు బయటపెట్టాలని కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.