IND vs PAK: విరాట్ సమాధానంతో ఆశ్చర్యపోయా.. నేను మాత్రం అలా ముగించా: సర్ఫరాజ్
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ ఉంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ఆటగాళ్లలో ఎలా ఉంటుంది..? దీనికి భారత మాజీసారథి విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చిన విధానం ఆశ్చర్యానికి గురి చేసిందని పాక్ అప్పటి కెప్టెన్ సర్ఫరాజ్అహ్మద్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) జరిగిన ఓ సంఘటనను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. పాక్కు సర్ఫరాజ్అహ్మద్ కెప్టెన్గా వ్యవహరించాడు. టోర్నీకి ముందు అన్ని జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ -పాక్ మ్యాచ్పై విలేకర్లు ప్రశ్నలు సంధించారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం సుదీర్ఘంగా సమాధానం ఇవ్వగా.. సర్ఫరాజ్ మాత్రం కేవలం ఆరు పదాల్లోనే ముగించేశాడట.
‘‘భారత్ - పాక్ జట్ల (IND vs PAK) మధ్య మ్యాచ్లకు హైప్ ఎందుకు ఉంటుంది..? అభిమానులు టికెట్ల గురించి అడిగితే మీరు ఎలా స్పందిస్తారు..? అని మమ్మల్ని అడిగారు. తొలుత విరాట్ను అడగండని నేను చెప్పా. బ్రదర్ తొలుత నువ్వు సమాధానం ఇవ్వొచ్చుగా అని విరాట్ను అడిగా. ఇక విరాట్ కోహ్లీ సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. అలాగే కొనసాగుతూ ఉన్నాడు. దీంతో నేను సదరు విలేకరి వైపు తిరిగి.. అతడు (విరాట్) ఎప్పుడు ఆగుతాడు? అని అడిగా. ఎందుకంటే కోహ్లీ పెద్ద పదాలతో ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో ఇదంతా ఇప్పుడు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? అని ఆ సమయంలో అనుకున్నా. చివరికి నేను కూడా ‘నా సమాధానం కూడా అదే’అని చెప్పేశా. ఎంతో తేలికైన ప్రశ్న కదా.. ఎందుకు విరాట్ అంత భారీ సమాధానం ఇచ్చాడని ఆలోచించా’’ అని సర్ఫరాజ్ తెలిపాడు.
విరాట్ సమాధానం ఇదీ..
దాయాదుల పోరుపై ఉత్కంఠను ఎలా చూస్తారనే ప్రశ్నకు విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ‘‘భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు చూసే దృష్టికోణానికి మేం (ఆటగాళ్లం) చూసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మైదానంలోకి అడుగు పెట్టేవరకే భావోద్వేగంతో ఉంటాం. ఎప్పుడైతే మ్యాచ్ కోసం బరిలోకి దిగుతామో ప్రొఫెషనల్ గేమ్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాం. బౌలర్లు, బ్యాటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఇతర జట్లతో ఆడినట్లే భావించి మరీ బరిలోకి దిగుతాం. అయితే, స్టేడియంలోని అభిమానుల కేరింతలు, అరుపులు మాపై కొంత ఒత్తిడి తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఇరు జట్ల సభ్యులం ఇలాగే ఫీల్ అయి మ్యాచ్ ఆడతాం’’ అని కోహ్లీ చెప్పాడు. చివరికి సర్ఫరాజ్ కూడా ‘‘నా సమాధానం కూడా అదే’ అని బదులిచ్చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్