Saurav Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీసులుపంపాలనుకున్న గంగూలీ!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.
ఇంటర్నెట్డెస్క్: తన ఆటతీరుతో విరాట్ కోహ్లీ భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడనంలో ఎలాంటి సందేహం లేదు. విజయవంతమైన కెప్టెన్గా కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న కోహ్లీ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ యాజమాన్యానికి, కోహ్లీకి పొసగడం లేదని తరచూ వార్తలు వస్తున్నాయి. అందుకే కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలకు ఆజ్యం తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కోహ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెబితే తననెవరూ ఆపలేదని తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఒకానొక సందర్భంలో ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. విలేకరుల సమావేశంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని గంగూలీ భావించాడట. అయితే షోకాజు నోటీసులు పంపేముందు గంగూలీ ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షాకు తెలిపాడట. దీంతో ఆయన ఈ విషయం పెద్దది కాకుండా గంగూలీని ఒప్పించాడట. ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సౌరభ్ గంగూలీతో సంబంధాలు దెబ్బతినడంతోనే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడా అన్న ప్రశ్నలకు షోకాజు నోటీస్ అంశం బలాన్ని చేకూరుస్తోంది.
ఏం జరిగిందంటే..
2021లో జరిగిన పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం చెందడంతో కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్గా, టెస్టులకు వైస్ కెప్టెన్గా రోహిత్ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పట్లో కోహ్లీ ప్రకటన భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక మూడు టెస్టుల సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా, దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ గెలిచింది. ఇక కీలక మూడో టెస్టుకు జట్టును ఎంపిక చేయడంలో ముసలం పుట్టినట్లు తెలిసింది. మూడో టెస్టుకు ఆజింక్య రహానెకు బదులుగా శ్రేయస్ అయ్యర్ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిసింది. కోచ్ ద్రవిడ్ మాత్రం రహానె వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడంతో కోహ్లీని మనస్తాపానికి గురైనట్లు సమాచారం. జట్టు ఎంపికలో, తుది జట్టు కూర్పులో తన ప్రమేయం లేకుండా పోవడంతో కోహ్లీ మూడో టెస్ట్ అనంతరం టెస్ట్ ఫార్మాట్కు కెప్టెన్గా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: నా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడడు: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఐపీఎల్లో ముంబయి జట్టుతో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 17వ సీజన్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. -
Ashwin: స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: అశ్విన్
టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. మొత్తం 26 వికెట్లు తీసి టాపర్గా నిలిచాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
-
Viral Video: సర్కస్లో స్టంట్.. పట్టుతప్పి 12 అడుగుల ఎత్తు నుంచి జారిపడిన యువతి
-
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
-
Sadananda: కాంగ్రెస్లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
-
AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు