Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్
భారత క్రికెట్లో కెప్టెన్సీ చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్లో కెప్టెన్సీ చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. దీనికి గల కారణాలు లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడుగురు కెప్టెన్లు భారత జట్టును నడిపించారు. దీంతో రోహిత్ వారసుడిగా పూర్తిస్థాయి సారథిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య ముందున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వీరిలో పాండ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలొచ్చాయి. ఎందుకంటే భారత టీ20లీగ్లో గుజరాత్ను ఛాంపియన్గా నిలిపిన హార్దిక్.. ఆ తర్వాత భారత జట్టు తరఫున ఐర్లాండ్ సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. తాజాగా విండీస్తో జరిగిన చివరి టీ20లోనూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఐతే ఆసియాకప్కు మాత్రం రాహుల్ని వైస్కెప్టెన్గా నియమించడంతో భవిష్యత్ సారథిగా హార్దిక్కి అవకాశం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
స్టైరిస్ ఓ క్రీడా ఛానెల్లో మాట్లాడుతూ ‘‘ఇది చమత్కారమైన చర్చ. ఎందుకంటే ఆరు నెలలు క్రితం మనమంతా హార్దిక్ గురించి మాట్లడతామని అనుకోలేదు. కానీ హార్దిక్ ఇప్పుడు ఛాంపియన్. మీరు ఫుట్బాల్లో చూసే ఉంటారు.. ఎక్కువ సందర్భాల్లో నైపుణ్యం, వ్యక్తిత్వం ఉన్న ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇచ్చి అతడికి జట్టును నడిపించే బాధ్యత అప్పగిస్తారు. ప్రస్తుతం టీమ్ ఇండియా టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని చూస్తే హార్దిక్పాండ్య లాంటి ఆట, వ్యక్తిత్వం ఉన్న ప్లేయర్కి అవకాశాలు రావొచ్చు. కాబట్టి ఆసియాకప్లో కాకపోయినా, భవిష్యత్తులో మనం హార్దిక్ని కెప్టెన్గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని స్టైరిస్ చెప్పాడు. అవకాశం ఇస్తే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తానని పాండ్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి