IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఇక భారత బ్యాటర్లపైనే భారం!
నాలుగో టెస్టు మ్యాచ్లో (IND vs AUS) ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy)ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజ్లో రోహిత్ శర్మ (17*), శుభ్మన్ గిల్ (18*) ఉన్నారు. దీంతో ఆసీస్ కంటే 444 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే భారత్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్ మాదిరిగా టీమ్ఇండియా బ్యాటర్లు రాణించాలి.
ఉస్మాన్తోపాటు గ్రీన్ సెంచరీ
బ్యాటింగ్కు అనుకూలంగా మారిన పిచ్పై ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) చెలరేగిపోయారు. ఓవర్నైట్ స్కోరు 255/4 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లో ఒక్క వికెట్టూ ఇవ్వకపోవడం విశేషం. ఈ క్రమంలో గ్రీన్ కూడా టెస్టుల్లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు ఏకంగా 208 పరుగులను జోడించారు. రవిచంద్రన్ అశ్విన్ (6/91) విజృంభించడంతో గ్రీన్తోపాటు క్యారీ (0) వెనువెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత వచ్చిన స్టార్క్ (6) కాసేపు అడ్డుగా నిలిచినా అశ్విన్ దెబ్బకు పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ నుంచి ఆసీస్ ఇన్నింగ్స్ను నడిపించిన ఉస్మాన్ ఖవాజా ఎట్టకేలకు అక్షర్ పటేల్కు వికెట్ సమర్పించాడు. డీఆర్ఎస్కు వెళ్లి మరీ టీమ్ఇండియా ఫలితం రాబట్టుకుంది. దీంతో 408 పరుగులకు 8 వికెట్లను ఆసీస్ కోల్పోయింది. అసలు కథ అప్పుడే స్టార్టయింది.
9వ వికెట్కు 50+
మరో రెండు వికెట్లు తీసి ఆసీస్ను త్వరగా ఆలౌట్ చేద్దామని భావించిన భారత్కు టాడ్ మర్ఫీ (41), లయన్ (34) కొరకరాని కొయ్యల్లా మారిపోయారు. వీరిద్దరూ 9వ వికెట్కు ఏకంగా 70 పరుగులను జోడించారు. అశ్విన్ బౌలింగ్లో మర్ఫీ వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో లయన్ కూడా అశ్విన్ బౌలింగ్లోనే విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చిపెవిలియన్కు చేరడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 6, షమీ 2.. జడేజా, అక్షర్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు