Zim vs Ind : నిన్నటిలా రాణించాలి.. రేపు సిరీస్ విజేతగా నిలవాలి
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. గురవారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో....
జింబాబ్వే, భారత్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. గురవారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శనివారం హరారే వేదికగానే జింబాబ్వే-భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జింబాబ్వే పుంజుకోవడం ఖాయం. బంగ్లాదేశ్తో జింబాబ్వే పోరాటం మరిచిపోకూడదు.
తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు అద్భుతంగా రాణించినా.. జింబాబ్వే లోయర్ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో మాత్రం కాస్త విఫలమైనట్లు ఉంది. కెప్టెన్ చకబ్వాతోపాటు సికిందర్ రజాను త్వరగానే పెవిలియన్కు చేర్చారు. అయితే తొమ్మిదో వికెట్కు బ్రాడ్ ఇవాన్స్-ఎన్గరవ 70 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లు ఆరంభంలో ఉన్న పట్టును విడిపించారు. లేకపోతే తొలి వన్డేలో జింబాబ్వే 150 పరుగుల్లోపే కుప్పకూలాల్సింది. దీంతో ఆఖరికి 189 పరుగులకు ఆలౌటై.. కాస్త గౌరవప్రదమైన స్కోరును భారత్కు లక్ష్యంగా నిర్దేశించింది.
కుల్దీప్ ఒక్కడే..
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ (3/27) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రసిధ్ (3/50) పరుగులు ఎక్కువ ఇచ్చినా వికెట్లు తీశాడు. ఇక అక్షర్ అయితే (3/24) కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ఒక వికెట్ మాత్రమే తీసి కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే కుల్దీప్ (10-1-36-0) యాదవ్ మాత్రం వికెట్ తీయడంలో ఇబ్బందిపడ్డాడు. కానీ పరుగులను నియంత్రించడం ఒక్కటే ఊరట. కానీ రెండో వన్డేలోనైనా వికెట్లను పడగొట్టి తన సత్తాను నిరూపించుకోవాలి. కీలక టోర్నీల్లో జట్టులో స్థానం దక్కాలంటే ప్రతి మ్యాచ్లోనూ రాణించాల్సిందే.
బ్యాటింగ్ ఓకే.. మరి
మొదటి వన్డేలో భారత ఓపెనర్లే 190 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. దీంతో మిగతావారికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకుని టీమ్ సారథ్య బాధ్యతలను చేపట్టిన కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడనేది చూడాలంటే వేచి చూడాల్సిందే. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా రెండో వన్డేలో అవకాశం వస్తే మాత్రం ఏమాత్రం చేజారనీయకూడదు. మరో రెండు నెలల్లో పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో ఫిట్నెస్తోపాటు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ఇండియా ఓపెనర్లు కూడా తొలి వన్డే ఆటనే కొనసాగించాలి. శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Virat Kohli: విరాట్ నిర్ణయం ఏమిటో?
నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో భారత ఓటమి తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. -
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. -
రేసులోకి వచ్చేదెవరో?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా? -
జైపుర్-బెంగాల్ సగం సగం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. -
విజృంభించిన కరన్, లివింగ్స్టన్
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ పుంజుకుంది. సామ్ కరన్ (3/33), లివింగ్స్టన్ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. -
గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు. -
అందుకు నీరజే కారణం
భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు. -
కోహ్లికి శతకాల సెంచరీ కష్టమే
విరాట్ కోహ్లికి 100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం తేలికేం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అన్నాడు. -
స్పెయిన్ చేతిలో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. -
అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
అజిత్కు రెండో స్థానం
అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గ్రాండ్ప్రి-2 వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో నారాయణ్ అజిత్ (73 కేజీ) గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచాడు. -
డబ్ల్యూపీఎల్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.