WTC 2: గెలిస్తే ఎన్ని పాయింట్లు? ఆరంభం ఎవరితో?
ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసింది. న్యూజిలాండ్ విజేతగా ఆవిర్భవించింది. టీమ్ఇండియా రన్నరప్గా నిలిచింది. కరోనా వైరస్.. బయో బుడగలు.. వంటి అడ్డంకులు ఎదురైనా డబ్ల్యూటీసీ 1 ఊహించిన దానికన్నా ఎక్కువే విజయవంతం అయింది..
స్లో ఓవర్ రేటుకు పాయింట్ల కోత.. 4+ టెస్టు సిరీసులు 3
ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసింది. న్యూజిలాండ్ విజేతగా ఆవిర్భవించింది. టీమ్ఇండియా రన్నరప్గా నిలిచింది. కరోనా వైరస్.. బయో బుడగలు.. వంటి అడ్డంకులు ఎదురైనా డబ్ల్యూటీసీ 1 ఊహించిన దానికన్నా ఎక్కువే విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు డబ్ల్యూటీసీ-2పై పడింది. పాయింట్ల పద్ధతి ఏంటి? ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? ఏ జట్లు ఎన్ని మ్యాచులు ఆడతాయి? వంటి విషయాలు తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంగ్లాండ్-భారత్ సిరీసుతో ఆరంభం
డబ్ల్యూటీసీ-2 వ్యవధి రెండేళ్లు. 2021 ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు జరుగుతుంది. ఫైనల్ ఎక్కడ జరుగుతుందో ఇంకా చెప్పలేదు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగే పటౌడీ సిరీసుతో ఛాంపియన్షిప్ ఆరంభమవుతుంది. డిసెంబర్లో యాషెస్ సిరీస్ మొదలవుతుంది. ఈ డబ్ల్యూటీసీలో ఐదు మ్యాచుల సిరీసులు ఈ రెండే కావడం గమనార్హం.
పెద్ద సిరీసులు తక్కువే
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా.. భారత్లో పర్యటించనుంది. మొత్తం 4 టెస్టులు ఆడనుంది. ఇవి కాకుండా టోర్నీలో 3 టెస్టుల సిరీసులు 7, రెండు టెస్టుల సిరీసులు 13 జరగనున్నాయి. తొలి డబ్ల్యూటీసీ మాదిరిగానే ఈ సారీ 9 టెస్టు జట్లు ఆరు సిరీసుల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 ఉంటాయి. ఎక్కువ టెస్టులతో కూడిన సిరీసులు ఆడుతున్నవి మొత్తంగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. మిగతా ఆరు జట్లు గరిష్ఠంగా 3 లేదా 2 మ్యాచుల సిరీసులే ఆడతాయి.
ఎవరెన్ని ఆడతారంటే
తాజా డబ్ల్యూటీసీలో ఇంగ్లాండ్ ఏకంగా 21 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత టీమ్ఇండియా 19 మ్యాచుల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా 18, దక్షిణాఫ్రికా 15 టెస్టులు ఆడతాయి. తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్ 13 టెస్టులే ఆడనుంది. వెస్టిండీస్, శ్రీలంకదీ అదే పరిస్థితి. పాకిస్థాన్ 14 మ్యాచులు ఆడనుండటం గమనార్హం. బంగ్లాదేశ్ మాత్రం అన్ని సిరీసుల్లోనూ 2 మ్యాచులే ఆడనుంది.
గెలిస్తే 12 పాయింట్లు
కరోనా వైరస్ వల్ల తొలి డబ్ల్యూటీసీకి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని మ్యాచులు జరగలేదు. దాంతో పాయింట్ల పద్ధతిని ఐసీసీ హఠాత్తుగా మార్చేసింది. వీటిపై విమర్శలు రావడంతో ఈ సారి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది! గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు. స్లో ఓవర్రేట్కు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన సమయానికి మించి ఎన్ని ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత విధిస్తారు. ఆడిన మ్యాచులు, గెలుపోటములు, పాయింట్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. వీటిని త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత