Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
భారత ఓపెనింగ్ జోడీల్లో సచిన్ - గంగూలీ తర్వాత.. సెహ్వాగ్ - సచిన్ (Sehwag - Sachin) జోడీదే టాప్. ఇద్దరూ దూకుడుగా ఆడేవారైనప్పటికీ సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) బ్యాటింగ్ శైలి విభిన్నం. అతడు క్రీజ్లో ఉన్నాడంటే ఎంతటి భీకర బౌలర్ అయినా సరే తడబాటుకు గురి కావాల్సిందే. సాధారణంగా బ్యాటర్లు సెంచరీ, డబుల్, ట్రిబుల్ సెంచరీ మార్క్కు చేరువగా వచ్చినప్పుడు ఆచితూచి ఆడుతూ ఉంటారు. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బౌండరీతోనే ఆ మార్క్ను దాటేయాలని భావిస్తుంటాడు. ఒక్కోసారి ప్రత్యర్థికి దొరికిపోయి ఔట్గా పెవిలియన్కు చేరిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాగే పాక్తో ముల్తాన్ టెస్టులోనూ సిక్స్లు కొట్టేందుకు ప్రయత్నించగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin) వారించాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
‘‘నేను చిన్పప్పటి నుంచి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడిని. బౌండరీల ద్వారానే ఎక్కువ పరుగులు రాబట్టాలని నా మైండ్ సెట్ అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇలానే భావించా. సెంచరీ చేయాలంటే ఎన్ని బౌండరీలు కావాలో లెక్కలేసుకొనేవాడిని. నేను 90ల్లోకి వచ్చిన తర్వాత శతకం చేయాలంటే కనీసం ఓ పది బంతులను తీసుకుంటే.. నన్ను ఔట్ చేయడానికి ప్రత్యర్థి బౌలర్లకు పది అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. అదే కేవలం రెండు బంతుల్లోనే కొట్టేందుకు ప్రయత్నిస్తే.. నన్ను అడ్డుకోవడానికి వారికి ఉండే ఛాన్స్ను రెండు బంతులకే తగ్గించినట్లు అవుతుంది. అప్పుడు రిస్క్ పర్సంటేజీ 100 నుంచి 20కి పడిపోతుంది’’ అని సెహ్వాగ్ వివరించాడు.
మూడంకెల స్కోరుకు చేరే క్రమంలో బౌండరీలు కొట్టడంపై తనను సచిన్ సున్నితంగా మందలించాడని సెహ్వాగ్ తెలిపాడు. ‘‘ఆసీస్తో టెస్టు సిరీస్ సందర్భంగా సైమన్ కటిచ్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టి 195 పరుగుల వద్దకు చేరా. మరో షాట్కు యత్నించి పెవిలియన్కు చేరా. అయితే ఆ మ్యాచ్లో మేం ఓడిపోయాం. ఇక పాక్తో ముల్తాన్ టెస్టులోనూ ఆరేడు సిక్స్లతో సెంచరీని పూర్తి చేశాను. అప్పుడు సచిన్ నా దగ్గరకు వచ్చి ‘మళ్లీ సిక్స్ కానీ కొట్టావంటే.. నిన్ను నేను బ్యాట్తో కొడతా’ అని హెచ్చరించాడు. ఎందుకు అని నేను అడిగా. దానికి సమాధానంగా ఆసీస్తో జరిగిన టెస్టులో నేను సిక్స్ కొట్టడం వల్లే ఓడిపోయినట్లు సచిన్ చెప్పాడు. అందుకే ముల్తాన్ టెస్టులో 120 నుంచి 295 పరుగుల వరకు ఒక్క సిక్స్ కొట్టలేదు. అప్పుడు సచిన్ దగ్గరకు వెళ్లి ‘ట్రిపుల్ సెంచరీ కోసం నేను సిక్స్ కొడతా..’ అని చెప్పా. అంతే సచిన్ ‘నీకేమైనా పిచ్చా..? ఇప్పటి వరకు ఎవరూ భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ కొట్టలేదు’’అని అన్నాడు. అలాగే 295 పరుగులు కూడా ఎవరూ కొట్టలేదు అని నేను బదులిచ్చా. ఆ వెంటనే ముస్తాఖ్ బౌలింగ్లో సిక్స్ కొట్టి త్రిశతకం సాధించా. అప్పుడు నాకంటే సచిన్ చాలా సంతోషించాడు’’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే