Chennai : ధోనీలా సుదీర్ఘకాలం చెన్నైని నడిపించగలిగే సామర్థ్యం అతడికే ఉందట.. విశ్లేషించిన సెహ్వాగ్!
చెన్నై జట్టు సారథి ఎంఎస్ ధోనీ ప్లేస్ను భర్తీ చేయగలిగే ఆటగాడెవరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పేశాడు. అంతేకాదండోయ్.. ధోనీలా సుదీర్ఘకాలంపాటు..
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టు సారథి ఎంఎస్ ధోనీ ప్లేస్ను భర్తీ చేయగలిగే ఆటగాడెవరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పేశాడు. అంతేకాదండోయ్.. ధోనీలా సుదీర్ఘకాలంపాటు నాయకత్వ బాధ్యతలను నిర్వహించగలిగే సత్తా కూడా ఆ యువ క్రికెటర్లో ఉందట.. ఇంతకీ అతడెవరో తెలుసా..? రుతురాజ్ గైక్వాడ్. అవునండీ గత సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచి.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో కాస్త తడబాటుకు గురై.. ఇప్పుడు కుదురుకుని రాణిస్తున్నాడు. ఈ సీజన్ మొదట్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీని వదులుకొని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే వ్యక్తిగతంగా విఫలం చెందడంతోపాటు చెన్నై వరుస పరాజయాల నేపథ్యంలో మరోసారి జట్టు పగ్గాలను ధోనీ అందుకున్నాడు. అయితే వచ్చే సీజన్లో ధోనీ కొనసాగుతాడా..? కెప్టెన్సీని నిర్వహిస్తాడా..? సారథ్యం చేయకపోతే ఎవరిని చెన్నైకి కొత్త కెప్టెన్గా నియమిస్తారు.. వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ధోనీ కొనసాగకపోతే మాత్రం రుతురాజ్ సరైన ఎంపికగా నిలుస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
‘‘ఫస్ట్క్లాస్ క్రికెట్లో మహారాష్ట్ర జట్టుకు రుతురాజ్ కెప్టెన్సీ చేశాడు. చాలా నిశ్శబ్దంగా తనపని చేసుకుపోతాడు. బ్యాటింగ్లో సెంచరీ కొట్టినా.. లేకపోతే డకౌట్గా వెనుదిరిగినా ఎలాంటి భావోద్వేగం కనిపించనీయడు. అతడి ప్రవర్తనలోనూ మార్పు ఉండదు. అందుకే చెబుతున్నా చెన్నై జట్టు సారథ్యానికి రుతురాజ్ అర్హుడు. గేమ్ను ఎలా నియంత్రించాలో బాగా తెలుసు. ఇప్పుడు రుతురాజ్ వయస్సు కూడా చాలా తక్కువే. కాబట్టి చెన్నై తరఫున కనీసం నాలుగైదు సీజన్లు ఆడగలడు. ధోనీలా సుదీర్ఘ కాలం కెప్టెన్గా రుతురాజ్ రాణిస్తాడు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. తుది నిర్ణయం తీసుకునేది చెన్నై యాజమాన్యమే కదా’’ అని సెహ్వాగ్ వివరించాడు.
ధోనీ కెప్టెన్సీలో ఎక్కువగా విజయవంతం కావడానికిగల కారణాలను కూడా సెహ్వాగ్ విశ్లేషించాడు. ‘‘ధోనీ చాలా కూల్. స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలడు. అంతేకాకుండా అదృష్టం ధోనీ వెంటే ఉంది. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగే వారితోనే లక్ ఉంటుందనేది నానుడి. అలానే రతురాజ్లోనూ ఇలాంటి గుణాలే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. మరోవైపు సెహ్వాగ్ విశ్లేషణకు మరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా మద్దతుగా నిలిచాడు. ‘‘రాబిన్, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో వంటి సీనియర్లు మరింత కాలం ఆడలేరు. ఇప్పటికే రవీంద్ర జడేజాను ప్రయత్నించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ చెప్పినట్లు రుతురాజ్కు నా మద్దతు తెలుపుతున్నా’’ అని జడేజా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం