Team India: వీళ్లని పంపే ఆలోచన లేనట్లుంది!
గాయపడ్డ శుభ్మన్గిల్ స్థానంలో యువ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్ను ఇంగ్లాండ్కు పంపాలని టీమ్ఇండియా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై భారత సెలెక్షన్ కమిటి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సెలెక్షన్ కమిటి ఛైర్మన్ చేతన్ శర్మ
పృథ్వీ, దేవ్దత్ కోసం కోహ్లీసేన అభ్యర్థన..
ఇంటర్నెట్డెస్క్: గాయపడ్డ శుభ్మన్గిల్ స్థానంలో యువ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్ను ఇంగ్లాండ్కు పంపాలని టీమ్ఇండియా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై భారత సెలెక్షన్ కమిటి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సెలెక్షన్ కమిటి ఛైర్మన్ చేతన్ శర్మ ఇప్పటివరకు దానిపై స్పందించలేదు. ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడారు.
‘శుభ్మన్గిల్ కాళ్ల నొప్పుల కారణంగా పూర్తి ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ఓపెనర్లు (పృథ్వీ, పడిక్కల్) కావాలని టీమ్ఇండియా మేనేజర్ గతనెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్కు మెయిల్ చేశారు’ అని ఆ అధికారి చెప్పారు. అయితే, దీనిపై శర్మ స్పందించకపోవడం గమనార్హం. అలాగే ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆ అధికారి పేర్కొన్నారు.
‘పృథ్వీ, పడిక్కల్ను ఇంగ్లాండ్కు పంపించాలనే అభ్యర్థనపై గంగూలీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారి సమాచారం రాలేదు. ప్రస్తుతం పృథ్వీ, పడిక్కల్ శ్రీలంక పర్యటనలో ఉన్నారు. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్లకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26న లంక పర్యటన ముగిసిన తర్వాత వారు ఇంగ్లాండ్కు వెళ్లొచ్చు. అయితే, జులై 15న టీమ్ఇండియాను దుర్హమ్లో కలిసి బయోబుడగలోకి వెళ్లకముందే వారిద్దరూ తమతో ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది’ అని ఆయన వివరించారు.
ఒకవేళ టీమ్ఇండియా పృథ్వీ ఒక్కడినే కోరితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ‘మొదట వారిని అధికారికంగా మెయిల్ చేయనివ్వండి. కానీ, పృథ్వీ ఇప్పుడు లంక పర్యటనలో పూర్తిగా లీనమయ్యాడు. అక్కడ ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్పైనే దృష్టి సారించాడు. మరోవైపు ఇంగ్లాండ్లో ఇప్పటికే 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో అభిమణ్యు ఈశ్వరన్ను పక్కనపెట్టినా ముగ్గురు స్పెషలిస్టు ఓపెనర్లు ఉన్నారు. అయితే, అభిమణ్యును పృథ్వీతో పోల్చిచూడలేము. ఎందుకంటే పృథ్వీ ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. అతడు ఇప్పటికే టెస్టుల్లో శతకం బాదాడు. ఇటీవలి కాలంలోనూ మంచి ఫామ్లో ఉన్నాడు. అతడిని ముందే లంక పర్యటనకు కాకుండా ఇంగ్లాండ్కు ఎంపికచేయాల్సింది’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం