అలా అడిగే సరికి.. సెరెనా భావోద్వేగం..
ఆస్ట్రేలియా ఓపెన్ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది 24 సార్లు అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాలన్న...
ప్రెస్మీట్ను మధ్యలోనే ముగించిన అమెరికన్ స్టార్..
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది సింగిల్స్లో అత్యధికంగా 24 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాలన్న ఆమె కోరిక ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్లో గురువారం జరిగిన సెమీ ఫైనల్స్లో సెరెనా ఓటమిపాలైంది. మూడో సీడ్ నవోమి ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. దీంతో మ్యాచ్ అనంతరం సెరెనా అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును వీడింది.
అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశాన్ని సెరెనా మధ్యలోనే ముగించింది. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె భావోద్వేగానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘ఇదే మీ చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ కాబోతోందా?’ అని అడిగిన ప్రశ్నకు ఆమె కంటతడి పెట్టింది. తర్వాత మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. అయితే, సెరెనా వెళ్లే ముందు ఇలా పేర్కొనడం గమనార్హం.. ‘ఆటకు వీడ్కోలు పలికితే, ఎవరికీ చెప్పకుండా చేస్తానేమో. నాకు తెలియదు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు మ్యాచ్లో ఓటమిపాలయ్యాక అభిమానులకు ఆమె అభివాదం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదే సెరెనాకు తుదిపోరు కావొచ్చని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, సెరెనా ఇదివరకు ఒసాకా చేతిలో 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్స్లోనూ ఓటమిపాలైంది. ఆపై మూడో సీడ్ ఒసాకా 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచింది. ఇక ఈసారి శనివారం జరిగే ఫైనల్లో ఒసాకా ఎవరిని ఓడిస్తుందో చూడాలి. మరో సెమీస్లో తలపడే జెన్నీఫర్ బ్రాడీ, కరోలినా ముచావో.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారితో ఒసాకా తుదిపోరులో పోటీపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!