Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ సహా టీ20 ప్రపంచకప్ పోటీలకు ...
ఆసియా కప్, పొట్టి ప్రపంచకప్నకు కెప్టెన్గా షకిబ్
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ సహా టీ20 ప్రపంచకప్ పోటీలకు కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ షకిబ్ అల్ హసన్కు సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. జింబాబ్వే మీద టీ20 సిరీస్ సహా వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ కోల్పోవడంతో భారీ మార్పులు చేసింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 17మందితో కూడిన జట్టును ఆసియా కప్ కోసం బీసీబీ ప్రకటించింది. ఇటీవల షకిబ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ బెట్టింగ్ కంపెనీతో షకిబ్ ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీసీబీ విచారణకు సిద్ధమైంది. అయితే వివాదం నెలకొనడంతో తాను బెట్విన్నర్ అనే న్యూస్తో జట్టు కట్టినట్లు పేర్కొన్నాడు. దీనిపైనా వివాదం కొనసాగడంతో ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంటున్నట్లు షకిబ్ ప్రకటించాడు. అంతకుముందు భారత్కు చెందిన బుకీతో ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో షకిబ్పై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది.
వచ్చే ఆసియా కప్లో మాత్రమే కాకుండా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ట్రైసిరీస్లోనూ టీమ్కు సారథిగా షకిబ్ వ్యవహరిస్తాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించకపోయినా సారథిగా మాత్రం షకిబ్ ఉంటాడని బీసీబీ వెల్లడించింది. ఆసియా కప్లో ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ తమ జట్లను ప్రకటించాయి.
ఆసియా కప్నకు బంగ్లాదేశ్ టీమ్: షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), అనముల్ హక్, ముష్ఫికర్ రహిమ్, అఫిఫ్ హోస్సెన్, మొసడక్ హోస్సెన్, మహముదుల్లా, మహేది హసన్, సైఫుద్దిన్, హసన్ మహ్ముద్, ముస్తాఫిజర్ రహ్మాన్, నాసుమ్ అహ్మద్, సబ్బిర్ రహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడట్ హోస్సెన్, పర్వేజ్ హోస్సెన్ ఎమన్, నురుల్ హసన్ సోహన్, టాస్కిన్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.