బంగ్లా బోర్డు నన్ను తప్పుగా చిత్రీకరించింది..!
శ్రీలంకతో టెస్టు సిరీస్ కాదని, ఐపీఎల్ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తనని తప్పుగా చిత్రీకరించిందని ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ విచారం వ్యక్తం చేశాడు...
ఐపీఎల్ ఆడటం నాకు ఉపయోగం: షకిబ్
ఢాకా: శ్రీలంకతో టెస్టు సిరీస్ కాదని, ఐపీఎల్ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తనని తప్పుగా చిత్రీకరించిందని ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ విచారం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఎలాగూ ఆడటం లేదనే ఉద్దేశంతోనే తాను ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అది తనకు ఉపయోగకరమని, జట్టుకు కూడా మంచిదని షకిబ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివర్లో భారత్లో ఆడే టీ20 ప్రపంచకప్ కోసం ఈ టీ20 లీగ్ ఉపయోగపడుతుందని స్పష్టం చేశాడు.
‘శ్రీలంకతో ఆడాల్సిన రెండు టెస్టుల సిరీస్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో మాకు చివరిది. ఏలాగూ మేం ఫైనల్లో ఆడట్లేదు. ఆ పాయింట్ల పట్టికలో మా జట్టు చివరి స్థానంలో ఉంది. కాబట్టి, నేను ఆ సిరీస్లో ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా లేదు. అలాగే నేను ఐపీఎల్ ఆడడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది చివర్లో భారత్లోనే టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో మేం సాధించాల్సింది చాలా ఉంది. అదెంతో ముఖ్యమైన టోర్నీ. ఈ టెస్టు సిరీస్లో మేం సాధించాల్సింది ఏమీ లేదు. దీంతో ఐపీఎల్ ఆడటమే మంచిదని నేను అనుకున్నా’ అని షకిబ్ పేర్కొన్నాడు.
అలాగే ఇకపై తాను టెస్టు క్రికెట్ ఆడనని చాలా మంది మాట్లాడుతున్నారని, దీంతో వారికి ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు బంగ్లా ఆల్రౌండర్ పేర్కొన్నాడు. ‘ఇకపై నేను టెస్టు క్రికెట్ ఆడనని చెప్పేవారందరూ.. నేను బీసీబీకి రాసిన లేఖను పూర్తిగా చదవలేదని అనుకుంటా. ఆ లేఖలో నేనెక్కడా టెస్టు క్రికెట్ ఆడనని చెప్పలేదు. రాబోయే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్లో ఆడాలనుకుంటున్నట్లు వివరించాను. కానీ, అక్రమ్ భాయ్(బంగ్లా క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్) ఇది చెప్పకుండా ఎంతసేపూ నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకోవడం లేదనే అన్నాడు’ అని షకిబ్ అసలు విషయం బయటపెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా